News November 6, 2024

ఉండి: ట్రైనింగ్‌లో కుప్పకూలి టీచర్ మృతి

image

టీచర్ ఆకస్మికంగా మృతిచెందిన ఘటన ప.గో జిల్లాలో జరిగింది. ఉండి మండలం ఉనుదుర్రు హైస్కూల్ ఇన్‌ఛార్జ్ HM తోట రత్నకుమార్ ఆగిరిపల్లి హీల్ స్కూల్‌లో నిర్వహిస్తున్న లీడర్షిప్ శిక్షణకు హాజరయ్యారు. ఈక్రమంలో అక్కడ బుధవారం ఉదయం గుండె నొప్పి రావడంతో చనిపోయారు. తీవ్రమైన ఒత్తిడి, వైద్య సదుపాయాలు లేని అటవీ ప్రాంతంలో శిక్షణ ఇవ్వడంతోనే రత్నకుమార్ చనిపోయారని ఇతర టీచర్లు ఆరోపించారు.

Similar News

News February 24, 2026

ప.గో జిల్లా కలెక్టర్ హెచ్చరిక

image

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం భీమవరం కలెక్టరేట్ నుంచి మెడికల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని విభాగాల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినా, రోగుల పట్ల అలసత్వం ప్రదర్శించినా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను హెచ్చరించారు.

News February 24, 2026

ప.గో జిల్లా కలెక్టర్ హెచ్చరిక

image

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం భీమవరం కలెక్టరేట్ నుంచి మెడికల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని విభాగాల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినా, రోగుల పట్ల అలసత్వం ప్రదర్శించినా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను హెచ్చరించారు.

News February 24, 2026

కేసుల పరిష్కారంలో సాంకేతికతను వాడాలి: ఎస్పీ

image

జిల్లాలోని పోలీస్ అధికారులతో ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మి మంగళవారం భీమవరం ఆయన కార్యాలయంలో నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్‌లో నెలవారీ నేర సమీక్ష చేపట్టారు. దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ విధానాన్ని విరివిగా ఉపయోగించాలని ఆయన సూచించారు. నిర్దేశిత కాలపరిమితిలో ఛార్జ్ షీట్లు దాఖలు చేయాలని, మార్చి 14న జరిగే లోక్ అదాలత్ ద్వారా గరిష్ఠ స్థాయిలో కేసులు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.