News December 21, 2024
ఉండి: పార్శిల్లో డెడ్బాడీ.. ఆ లేడీ ఎవరు?

ఉండి(M) యండగండిలో పార్శిల్లో <<14930123>>డెడ్బాడీ <<>>ఘటన గంటకో మలుపు తిరుగుతోంది. ఓ ప్లేస్లో పార్శిల్ ఉందని ఆటో డ్రైవర్కు ఓ మహిళ కాల్ చేసి చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు అతను దానిని తీసుకెళ్లి తులసికి ఇచ్చాడని తెలుస్తోంది. కాగా పదేళ్ల కిందటే మిస్ అయిన తులసి భర్త, డెడ్బాడీ వచ్చిన తర్వాత మాయమైన తులసి చెల్లి భర్త ఎక్కడున్నారు? కాల్ చేసిన మహిళ, డెడ్బాడీ ఎవరిది అనే ప్రశ్నలకు జవాబు తెలియాల్సి ఉంది.
Similar News
News November 7, 2025
మత్తు పదార్థాల నివారణపై గట్టి నిఘా ఉంచాలి: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్ చాంబర్లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణిని ఇన్ఛార్జ్ జిల్లా మధ్య నిషేధ ఆబ్కారీ అధికారి ఆర్.వి. ప్రసాద్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కడా మత్తు పదార్థాల అమ్మకం, వినియోగం ఉండరాదని, దీనిపై క్షేత్రస్థాయిలో గట్టి నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు.
News November 6, 2025
భీమవరం: మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

భీమవరం గునుపూడి పీఎస్ఎం బాలికల ఉన్నత పాఠశాలను కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాలను స్వయంగా రుచి చూసి సంతృప్తిని వ్యక్తం చేశారు. 936 విద్యార్థులు కలిగిన ఉన్నత పాఠశాలలో విద్యార్థులంతా వరుస క్రమంలో వచ్చి ఆహార పదార్థాలను వడ్డించుకుని భుజించడం సంతోషంగా ఉందన్నారు.
News November 6, 2025
భీమవరం: కలెక్టరేట్ శాశ్వత భవనం ఎక్కడ..?

పశ్చిమ గోదావని జిల్లాకు నూతన కలెక్టరేట్ భవనం నిర్మాణం ఎక్కడ చేయాలనే అంశంపై కొంతకాలం పెద్ద వివాదం నడిచింది. జిల్లాలోని పెద్ద చర్చి ప్రదేశం అంశంగా కూడా ఈ వివాదం జరిగింది. ప్రస్తుతం ఆ వివాదాలు కనుమరుగై, కలెక్టరేట్ ఊసే లేకుండా పోయింది. భీమవరంలో నిర్మిస్తారా, ఉండిలో ఏర్పాటు చేస్తారా లేక నరసాపురం తరలిస్తారా అనేది తేలాల్సి ఉంది. దీనిపై అధికారుల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.


