News July 10, 2024
ఉక్కు పరిశ్రమ కోసం మంత్రి మండిపల్లికి వినతి
కడపలో ఉక్కు పరిశ్రమను నిర్మించాలని కోరుతూ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి విద్యార్థి యువజన సంఘాల నాయకులు మంగళవారం వినతి పత్రం ఇచ్చారు. ఏటా లక్షలాది మంది నిరుద్యోగులు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు మంత్రికి తెలిపారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తే లక్షలాది మందికి ఉద్యోగాలు దొరుకుతాయని వారు మంత్రికి విన్నవించారు.
Similar News
News October 1, 2024
వైవీయూ ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్గా ఆచార్య తప్పెట రాంప్రసాద్ రెడ్డి
వైవీయూ ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్గా తెలుగు విభాగం ప్రొఫెసర్ తప్పెట రామప్రసాద్ రెడ్డిని నియమించారు. మంగళవారం సాయంత్రం విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్, ప్రొఫెసర్ కె. కృష్ణారెడ్డి తన ఛాంబరులో నియామక పత్రం అందజేశారు. ఇదివరకు ఈ స్థానంలో ఉన్న ఆచార్య రఘునాథరెడ్డి రిలీవ్ అయ్యి ప్రధాన ఆచార్యులుగా కొనసాగనున్నారు. నూతన రిజిస్ట్రార్కు బోధన, బోధ నేతర సిబ్బంది అభినందనలు తెలియజేశారు.
News October 1, 2024
కమలాపురం వద్ద చెట్టును ఢీకొన్న కళాశాల బస్సు
కమలాపురం పట్టణంలోని ఓ జూనియర్ కళాశాలకు చెందిన వ్యాను మంగళవారం ఉదయం చెట్టును ఢీకొంది. స్థానికుల వివరాల ప్రకారం.. రోజు మాదిరిగానే కళాశాలకు చెందిన వ్యాను విద్యార్థులను ఎక్కించుకొని వస్తుండగా కొండాయపల్లె వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉండే చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సిఉంది.
News October 1, 2024
కడప: రోడ్డు ప్రమాద ఘటనపై అనేక అనుమానాలు?
కడప జిల్లా YVU యూనివర్సిటీ వద్ద సోమవారం రాత్రి కానిస్టేబుల్ శ్రీనివాసరెడ్డి కాళ్లు విరిగి పడిపోయిన విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న పోలీసులు రోడ్డు ప్రమాదంగా పరిగనించి వేలూరు ఆసుపత్రికి తరలించారు. అర్ధరాత్రి సమయంలో ఘటన జరగడంతో కేవలం కాళ్లకు మాత్రమే కత్తితో నరికిన గాయాలు ఉండగా.. చివరికి <<14239401>>ఎవరో కాళ్లను నరికినట్లు<<>> అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పోలీసులతోపాటు వారి బంధువులు కూడా అనుమానిస్తున్నారు.