News March 29, 2025
ఉగాది వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయండి

శ్రీ విశ్వా వసు నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఉదయభాస్కర్ సంబంధిత అధికారులకు సూచించారు. శుక్రవారం తన చాంబర్లో ఉగాది వేడుక నిర్వహణకు వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 30వ తేదీ ఉదయం 9 గంటల నుంచి నెల్లూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర కస్తూర్బా కళాక్షేత్రంలో ఉగాది వేడుక నిర్వహిస్తామన్నారు.
Similar News
News November 8, 2025
NLR: 12న వైసీపీ ప్రజాపోరు యాత్ర

నెల్లూరు జిల్లా జిల్లా వ్యాప్తంగా ఈనెల 12న వైసీపీ ప్రజాపోరు యాత్ర నిర్వహిస్తామని కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రకటించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకించే ఈ యాత్ర జరగనుంది. వాల్ పోస్టర్లను నెల్లూరులో శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనాలని కోరారు. ఎమ్మెల్సీలు మాధవరెడ్డి, మేరిగ మురళీధర్, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
News November 8, 2025
నెల్లూరు: 15 నుంచి నీరు విడుదల

నెల్లూరు జిల్లా రైతులకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శుభవార్త చెప్పారు. జిల్లాలోని సోమశిల, కండలేరు జలాశయాల నుంచి ఈనెల 15న నీరు విడుదల చేస్తామని ప్రకటించారు. నెల్లూరులో ఇవాళ జరిగిన IAB సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రబీ సీజన్లో రైతులకు ఇబ్బంది లేకుండా నీళ్లు అందిస్తామన్నారు. రాళ్లపాడు ప్రాజెక్టుకు సైతం సోమశిల నుంచి నీరిస్తామని స్పష్టం చేశారు.
News November 8, 2025
నెల్లూరు: అధికారులకు షోకాజ్ నోటీసుల జారీ

నెల్లూరు జిల్లాలో విధి నిర్వహణలో అలసత్వం వహించిన నలుగురు పంచాయతీ కార్యదర్శులు, నిధులు దుర్వినియోగానికి పాల్పడిన సర్పంచుకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు DPO శ్రీధర్ తెలిపారు. స్వర్ణ పంచాయతీ పోర్టల్లో హౌస్ టాక్స్ మెటీరియల్ గురించి తప్పుగా నమోదు చేసిన ఉదయగిరి, పెద్దపవని, ఏఎస్ పేట, తాటిపర్తి PSలకు నోటీసులు అందజేశారు. ఎనమాదాల సర్పంచ్ సుందరయ్య ఆరో ప్లాంట్ నిధులు దుర్వినియోగంపై నోటీసులు అందజేశారు.


