News November 6, 2025
‘ఉచితం, తక్కువ లాభం’ అంటే మోసమే: ఏసీపీ

సైబర్ నేరాల గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సిద్దిపేట సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏసీపీ శ్రీనివాస్ సూచించారు. సైబర్ జాగృతి దివస్ సందర్భంగా సిద్దిపేట మెడికల్ కళాశాల విద్యార్థులకు గురువారం అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్లు ఆశ, భయం పేరుతో భయపెడుతూ, మభ్యపెడుతున్నారని, జాగ్రత్తగా ఉండాలన్నారు. ఉచితం లేదా తక్కువ సమయంలో ఎక్కువ లాభం వస్తుందంటే అది మోసమే అని గ్రహించాలని ప్రజలకు ఏసీపీ సూచించారు.
Similar News
News November 7, 2025
కడప: శ్రీ చరణికి రూ.10 లక్షలు ప్రకటించిన ఎంపీ మేడా

వరల్డ్ కప్లో సత్తా చాటిన ఇండియన్ ఉమెన్స్ క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీ చరణికి రాజ్యసభ ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి రూ.10 లక్షల ప్రోత్సాహక బహుమతిని ప్రకటించారు. ఉమ్మడి కడప జిల్లాకు చెందిన చరణి చూపిన ప్రతిభ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. యువత అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో ఈ బహుమతి ప్రకటించానని ఆయన చెప్పారు.
News November 7, 2025
రేషనలైజేషన్ ప్రక్రియ పకడ్బందీగా పూర్తి చేయాలి: కలెక్టర్

జిల్లాలో పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలని ఈఆర్ఓ, ఎఈఆర్ఓలను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. ప్రతిపాదించిన కేంద్రాలను స్వయంగా పరిశీలించి, నివేదికలు సమర్పించాలని సూచించారు. జిల్లాలో 1,629 పోలింగ్ కేంద్రాలు ఉండగా, కొత్తగా 113 కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. కొత్త కేంద్రాలు ప్రైవేట్ పాఠశాలలు, రాజకీయ సంబంధిత భవనాల్లో ఏర్పాటు చేయరాదని పేర్కొన్నారు.
News November 7, 2025
విద్యార్థులు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి: ఎస్పీ

ఆటోలు కళాశాలల స్కూల్ బస్సుల్లో విద్యార్థులను, ప్రజలను పరిమితికి మించి ఎక్కించుకొని ప్రయాణించరాదని ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టంచేశారు. గురువారం ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్పై పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. కళాశాలలు, స్కూల్ యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ వాడటం, రోడ్ల వెంట ఆటోలను నిలపడం, మద్యం తాగి వాహనాలు నడిపడం వంటికి చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.


