News June 21, 2024
ఉచిత నైపుణ్య శిక్షణ

చిత్తూరు: ఇరువరంలో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) నందు APSSDC, PMKV సంయుక్త ఆధ్వర్యంలో అసిస్టెంట్ ఎలక్ట్రిషన్, అసిస్టెంట్ ప్లంబర్ కోర్సుల్లో ఉచిత నైపుణ్య శిక్షణ కల్పిస్తున్నట్లు సెంటర్ ఏడీ సతీశ్ చంద్ర పేర్కొన్నారు. పదో తరగతి పాసై, 15-45 సంవత్సరంలోపు అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన వారు PH కాలనీ వద్ద గల NAC కార్యాలయంలో సంప్రదించగలరు. దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 28.
Similar News
News November 9, 2025
త్వరలోనే ఏనుగుల సమస్యలకు పరిష్కారం: పవన్

ఏనుగుల గుంపుతో కన్నా ఒంటరి ఏనుగుతోనే ఎక్కువ ప్రమాదమని MLA అమర్నాథ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆయన Dy.CM పవన్తో కలిసి పలమనేరులోని కుంకీ ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. అధికారులు ‘ఏనుగులతో సమస్యలు వాటి పరిష్కార మార్గాలను’ వివరించారు. కుంకీ ఏనుగులతో ఒంటరి ఏనుగులకు చెక్ పెట్టవచ్చని, దీనికి సాంకేతిక తోడైతే మరింత ప్రయోజనం ఉంటుందని వారు పేర్కొన్నారు. కలెక్టర్, DFO పాల్గొన్నారు.
News November 8, 2025
వంద శాతం దీపం కనెక్షన్లు ఇచ్చాం: బాబు

1,291 కుటుంబాలకు LPG కనెక్షన్లు ఇచ్చామని CM చంద్రబాబు తెలిపారు. 37,324 మందికి పెన్షన్లు ఇస్తున్నామని, 42,232 మంది విద్యార్థుల తల్లులకు తల్లికి వందనం అందించామన్నారు. P4 కింద 7,401 బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చేశామని చెప్పారు. 7,489 SC, ST కుటుంబాలకు సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు ఈ నెలాఖరుకు పూర్తవుతుందన్నారు. 5 లక్షల లీటర్ల పాలు కుప్పంలో ప్రస్తుతం ఉత్పత్తి అవుతోందని ఇది 10 లక్షలకు చేరాలని కోరారు.
News November 8, 2025
చిత్తూరు: జర్నలిజం పేరుతో వేధింపులు తగదు

జర్నలిజం పేరుతో అధికారులను వేధించడం తగదని కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. బ్లాక్ మెయిల్ చేసే విలేకరులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ కార్యాలయాలలో సిబ్బంది నిర్భయంగా పనిచేసుకునే వాతావరణం కల్పించడం తన బాధ్యతని పేర్కొన్నారు. ఇద్దరు పాత్రికేయులు మహిళా ఉద్యోగులను బెదిరించిన సంఘటన తన దృష్టికి వచ్చిందన్నారు. దీనిని విచారించి ఒకరి అక్రిడేషన్ రద్దు చేశామన్నారు.


