News January 6, 2026

ఉచిత విద్యుత్ కోసం ఏడాదికి రూ.15,946 కోట్లు: భట్టి

image

TG: ఉచిత విద్యుత్ కోసం ఏడాదికి రూ.15,946 కోట్లు సబ్సిడీ రూపంలో ఇస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ట్వీట్ చేశారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ద్వారా 29.23 లక్షల మంది లబ్ధి పొందుతుండగా రూ.13,499 కోట్లు ఖర్చవుతోందన్నారు. ‘గృహజ్యోతి’తో 52.82 లక్షల మందికి బెనెఫిట్ కలుగుతుండగా, రూ.2,086 కోట్లు సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు. సెలూన్లు, లాండ్రీలు, దోబీఘాట్లు, చేనేతకూ సబ్సిడీ అందిస్తున్నామన్నారు.

Similar News

News February 21, 2026

T20 WC: భారత్‌కు షాక్!

image

సూపర్-8లో రేపు సౌతాఫ్రికాతో మ్యాచుకు ముందు టీమ్‌ఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది. నిన్న నెట్స్‌లో పేస్ బౌలర్ సిరాజ్ గాయపడినట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. హార్దిక్ బ్యాటింగ్ చేస్తూ కొట్టిన బంతి సిరాజ్ మోకాలికి తగలడంతో నొప్పితో మైదానాన్ని వీడినట్లు తెలిపాయి. సిరాజ్ గాయం తీవ్రతపై టీమ్ మేనేజ్‌మెంట్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. అటు ప్రిపరేషన్ ఫుల్ స్వింగ్‌లో ఉందంటూ ప్లేయర్ల ఫొటోలను BCCI షేర్ చేసింది.

News February 21, 2026

చాపింగ్ బోర్డును ఇలా క్లీన్ చేయండి

image

కూరగాయలు కట్ చేయడం కోసం చాపింగ్‌ బోర్డు వాడతారు. కానీ దాని క్లీనింగ్‌పై అంత దృష్టి పెట్టరు. దీనికోసం కొన్ని టిప్స్..* చాపింగ్​బోర్డుపై కొద్దిగా నీళ్లు, బేకింగ్ సోడా వేసి నిమ్మచెక్కతో రుద్ది వదిలేయాలి. 15 నిమిషాల తర్వాత క్లీన్ చేస్తే సరిపోతుంది. * ఉప్పు, నిమ్మచెక్కతో చాపింగ్ బోర్డును రుద్ది, 10 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగెయ్యాలి. * దీన్ని క్లీన్ చేయడానికి మెటల్ స్క్రబ్బర్లను వాడకూడదు.

News February 21, 2026

10% గ్లోబల్ టారిఫ్‌తో లాభమా? నష్టమా?

image

ట్రంప్ విధించిన 10% గ్లోబల్ <<19198500>>టారిఫ్‌పై<<>> ఆర్థిక నిపుణులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. దీనివల్ల స్థానిక ఉద్యోగాలు పెరుగుతాయని, ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని కొందరు అంటున్నారు. కానీ నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యులపై భారం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇతర దేశాలు కూడా ఎదురుదాడికి దిగితే వ్యాపారాలు దెబ్బతినవచ్చంటున్నారు. ఈ నిర్ణయం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు.