News June 29, 2024
ఉట్నూర్: అధికారులతో ఐటీడీఏ పీఓ సమావేశం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719580757675-normal-WIFI.webp)
ప్రధానమంత్రి జన జాతీయ న్యాయ మహా అభియాన్ పథకాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా ఆదేశించారు. శుక్రవారం కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. పథకం అర్హులైన లబ్ధిదారులకు ఆధార్, క్యాస్ట్ సర్టిఫికెట్, మొబైల్ నంబర్లను 15 రోజుల్లో కచ్చితంగా పూర్తిచేయాలని ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల మండల తహసిల్దార్లను ఆదేశించారు. ఐటీడీఏ కోర్ట్ కేసులపై ప్రత్యేకదృష్టి సారించాలన్నారు.
Similar News
News July 1, 2024
పోలీసులు అనుమతి తప్పనిసరి: నిర్మల్ ఎస్పీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719804117316-normal-WIFI.webp)
నిర్మల్ జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా 30 పోలీస్ యాక్ట్ను సోమవారం నుంచి అమలుచేసినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఈనెల 31 వరకు జిల్లాలో 30 పోలీస్ ఆక్ట్ అమలులో ఉంటుందని పోలీసుల ముందస్తు అనుమతులు లేకుండా ఎలాంటి సమావేశాలు, సభలు ,ర్యాలీలు నిర్వహించవద్దని శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారిపట్ల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News July 1, 2024
భైంసా: గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719796102338-normal-WIFI.webp)
భైంసా పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ
కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ సుధాకర్ తెలిపారు. ఆంగ్లం, తెలుగు మాధ్యమాల్లో రాజనీతిశాస్త్రం, కంప్యూటర్ సైన్స్, ఉర్దూ మాధ్యమంలో ఉర్దూ-1, రాజనీతిశాస్త్రం, చరిత్ర, జంతుశాస్త్రం, రసాయనశాస్త్రం సబ్జెక్టుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వార ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు.
News July 1, 2024
కాగజ్నగర్: వెనుకబడిన ప్రాంతాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719739812532-normal-WIFI.webp)
వెనుకబడిన ప్రాంతాలకు విద్య, వైద్యం అందించడమే మా ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అన్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభోత్సవం చేశారు. మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏది నెరవేర్చలేదని ప్రజలు గుర్తించాలన్నారు.