News July 3, 2024
ఉత్తమ ప్లాంటుగా చిల్పూర్ కేటీపీపీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719920109740-normal-WIFI.webp)
భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండలం చిల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ (కేటీపీపీ) 600 మెగావాట్ల ప్లాంట్కు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించడంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం వరకు 200 రోజులుగా నిరంతరాయంగా విద్యుత్ అందించిన 600 మెగావాట్ల ప్లాంట్ను రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ప్లాంటుగా కేటీపీపీని గుర్తించడంపై ప్లాంట్ లో వివిధ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News July 5, 2024
మరో మైలురాయికి చేరువగా జనగామ ప్రభుత్వ డిగ్రీ కళాశాల!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720158539034-normal-WIFI.webp)
జనగామ ఆంధ్ర భాషాభివర్ధిని (ABV) ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరో మైలు రాయిని చేరుకోబోతోంది. జిల్లాలో ఏకైక ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా ఉన్న ఈ కాలేజీకి ఈ విద్యా సంవత్సరంలో స్వతంత్ర ప్రతిపత్తి హోదా వస్తుందని ఆశిస్తున్నారు. UGC నిబంధనలను అనుసరించి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రతిపాదనలను UGCకి, కేయూ రిజిస్ట్రారు, కళాశాల అభివృద్ధి కమిటీ డీన్కు సమర్పించినట్లు తెలుస్తోంది.
News July 5, 2024
నర్సింహులపేట: ఇద్దరు యువకుల మృతి.. కేసు నమోదు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720150840253-normal-WIFI.webp)
MHBD జిల్లా నర్సింహులపేట మండలం రామన్నగూడెంలో అనుమానాస్పద స్థితిలో శ్రవణ్ (25), రహీమ్ (24) అనే ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం విదితమే. ఈ విషయమై స్థానిక పోలీసులకు బాధిత కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వారి మృతికి కల్తీ కల్లు కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.
News July 5, 2024
హనుమకొండ: పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720141011717-normal-WIFI.webp)
ఏటూరునాగారానికి చెందిన ప్రవీణ్ కుమార్(30), హసన్పర్తి మండలం భీమారానికి చెందిన యువతి (28) కలిసి డిగ్రీ చదివారు. అప్పటి నుంచే ఇద్దరు ప్రేమించుకున్నారు. ప్రస్తుతం భీమారంలోనే ఇద్దరు కలిసి ఉంటున్నారు. అయితే పెళ్లి చేసుకోమని యువతి కోరగా నిరాకరించాడు. దీంతో యువకుడిపై పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేసినట్లు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసినట్లు KU ఎస్సై సురేశ్ తెలిపారు.