News June 13, 2024

ఉత్తరాంధ్రకు చంద్రబాబు ప్రాధాన్యత: విజయనగరం ఎంపీ

image

ఉత్తరాంధ్రకు చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారని ఎంపీ అప్పలనాయుడు అన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రకు ఒక కేంద్రమంత్రి పదవి ఇచ్చారని పేర్కొన్నారు. విశాఖ నగరాన్ని ఆర్థిక రాజధానిగా ప్రకటించారని తెలిపారు. స్కూల్ బ్యాగ్స్‌పై జగన్ ఫొటో ఉన్నా కూడా పంపిణీకి చంద్రబాబు ఆదేశించడం గొప్ప విషయమని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, సామాజిక న్యాయం పాటించి మంత్రి పదవులు ఇచ్చారన్నారు.

Similar News

News October 2, 2024

VZM: 2019కి ముందు ఎన్ని మద్యం షాపులు ఉండేవి అంటే..?

image

వైసీపీ ప్రభుత్వం రాక ముందు టీడీపీ ప్రభుత్వంలో చివరిగా 2017 జూలైలో ప్రైవేట్ మద్యం షాపులు ఏర్పాటయ్యాయి. అప్పటి ఉమ్మడి విజయనగరం జిల్లాలో 210 షాపులకు టెండర్లు పిలవగా 3,636 దరఖాస్తులు వచ్చాయి. తద్వారా అప్లికేషను ఫీజు కింద ప్రభుత్వానికి రూ. 21 కోట్లు ఆదాయం వచ్చింది. అప్లికేషను ఫీజు కింద జనాభాను బట్టి రూ. 55 వేలు నుంచి 75 వేల వరకు నిర్ణయించారు. తాజాగా జిల్లాలో 153 షాపులకు టెండర్లు పిలిచారు.

News October 1, 2024

రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది..?: బొత్స

image

ఆంధ్ర రాష్ట్రంలో అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. మంగళవారం విశాఖ వైసీపీ ఆఫీసులో ఆయన విలేకరులతో మాట్లాడారు. నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. మద్యంపై దృష్టి పెట్టి పెద్ద స్థాయిలో ప్రచారం చేస్తోందని అన్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు బూడి ముత్యాల నాయుడు, కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

News September 30, 2024

విజయనగరం ఉత్సవాల్లో 12 చోట్ల వినోద కార్యక్రమాలు

image

అక్టోబర్ 13, 14 తేదీలలో నిర్వహించనున్న విజయనగరం ఉత్సవాల్లో 12 ప్రధాన వేదికల వద్ద వినోద కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ తెలిపారు. వేదికల వద్ద జిల్లా అధికారులను ఇన్ ఛార్జ్‌లుగా నియమించినట్లు వెల్లడించారు. కార్యక్రమాల పట్ల వారి ఆసక్తి తగ్గట్టుగా సుమారు 50 మంది లైఫ్ మెంబర్లను ప్రతి వేదిక వద్ద సర్దుబాటు చేసినట్లు పేర్కొన్నారు.