News February 27, 2026
ఉత్తరాంధ్రకు భారీ ఫార్మా సంస్థ: లోకేశ్

AP: కూటమి పాలనలో ఉత్తరాంధ్ర శరవేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి లోకేశ్ తెలిపారు. రేపు అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని ఇండస్ట్రియల్ పార్కులో ప్రముఖ ఫార్మా సంస్థ ‘బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్’కు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. రూ.2,300 కోట్ల పెట్టుబడితో 1,750 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు రానున్నాయని పేర్కొన్నారు. 2028-29 FYకు సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభించనుందని వివరించారు.
Similar News
News February 28, 2026
విజయ్కు దెబ్బ మీద దెబ్బ!

తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి నుంచి గడ్డుకాలం ఎదురవుతోంది. తొలుత కరూర్ తొక్కిసలాటలో 41 మంది చనిపోవడంతో ఆయనపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. దానిపై సీబీఐ ఎంక్వైరీ జరిగింది. తన చివరి చిత్రం ‘జననాయగన్’ సెన్సార్ సర్టిఫికెట్ కారణంగా విడుదల కాలేదు. ఎప్పుడవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. తాజాగా విజయ్ భార్య విడాకులు కావాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
News February 27, 2026
ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ గెలుపు

T20WC: కొలంబోలో NZతో జరిగిన ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జట్టు కీలక దశలో వికెట్లు కోల్పోవడంతో సాధించాల్సిన రన్రేట్ 14+కు చేరింది. ఈ క్రమంలో విల్ జాక్స్(32*) NZ బౌలర్లపై విరుచుకుపడ్డారు. సిక్సులు, బౌండరీలతో జట్టును విజయతీరాలకు చేర్చారు. అహ్మద్(19*) సైతం మెరుపులు మెరిపించారు. 18వ ఓవర్లో 22, 19వ ఓవర్లో 16 రన్స్ రావడం ఇంగ్లండ్కు కలిసొచ్చింది.
News February 27, 2026
కాంగ్రెస్ నిరసనలకే పరిమితమైంది: పీఎం మోదీ

1984 నుంచి కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతూ వస్తోందని.. ఇప్పుడు నిరసనలకే పరిమితమైందన్నారు పీఎం మోదీ. ఆర్టికల్ 370 రద్దు, CAA, ట్రిపుల్ తలాక్ రద్దు, UPI, స్వచ్ఛభారత్, కరోనా వ్యాక్సిన్.. ఇలా సంస్కరణలు అన్నింటినీ వ్యతిరేకించిందన్నారు. ప్రతిపక్షం అంటే విమర్శలే కాదని, ప్రత్యామ్నాయ విజన్ చూపాలని హితవు పలికారు. కాంగ్రెస్కు మిలీనియల్స్ బుద్ధి చెప్పారని.. ఇప్పుడు జెన్జీలు సిద్ధంగా ఉన్నారన్నారు.


