News August 13, 2024
ఉత్తరాంధ్ర వైసీపీలో జోష్..!

అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉత్తరాంధ్ర వైసీపీ కేడర్ నిరుత్సాహానికి గురైంది. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వచ్చింది. గెలవడానికి బలమున్నా సరే టీడీపీ పోటీలో ఉంటే ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఇదే సమయంలో బొత్సను వైసీపీ అభ్యర్థిగా జగన్ ప్రకటించారు. చివరకు పోటీ నుంచి కూటమి తప్పుకోవడంతో ఆయన గెలుపు లాంఛనం కానుంది. బొత్స లాంటి సీనియర్ నేత MLC అయితే YCPకి జోష్ వస్తుందా? మీ కామెంట్.
Similar News
News September 23, 2025
ఆపరేషన్ లంగ్స్ 2.O ఎవరికీ వ్యతిరేకం కాదు: కమిషనర్

ఆపరేషన్ లంగ్స్ 2.O ఎవరికీ వ్యతిరేకం కాదని GVMC కమిషనర్ కేతన్ గార్గ్ అన్నారు. నగర ప్రజల ఆరోగ్యం, భద్రత సౌకర్యం కోసం దీన్ని ప్రారంభించామన్నారు. వీధి వ్యాపారులకు క్రమబద్ధమైన జోన్లు ఏర్పాటు చేస్తామన్నారు. వాటి ద్వారా వారికి ఆదాయం పొందే అవకాశం కల్పిస్తామన్నారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన నగరాన్ని తీర్చిదిద్దడమే దీని లక్ష్యమని వివరించారు.
News September 23, 2025
ఈ గవర్నెన్స్ సదస్సులో ఉత్తమ పంచాయతీలకు అవార్డ్స్

విశాఖలో నిర్వహించిన ఈ-గవర్నెన్స్ సదస్సులో ఉత్తమ పంచాయతీలకు కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అవార్డులను అందజేశారు.
గోల్డ్ అవార్డు : రోహిణి పంచాయితీ, Dhule జిల్లా, మహారాష్ట్ర
సిల్వర్ అవార్డు : West Majlishpur పంచాయతీ, వెస్ట్ త్రిపుర, త్రిపుర
జ్యారీ అవార్డు: 1.Suakati పంచాయతీ, Kendujhar జిల్లా, ఒరిస్సా
2.Palsana పంచాయితీ, సూరత్ జిల్లా, గుజరాత్
సర్పంచులు అవార్డులను స్వీకరించారు.
News September 22, 2025
భూములిచ్చిన రైతులను ఆదుకుంటాం: CM

గూగుల్ డేటా సెంటర్ కోసం తర్లువాడలో భూములిచ్చిన రైతులను ఆదుకుంటామని CM చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం నగరానికి వచ్చిన ఆయనకు భీమిలి MLA గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ హరేందిర ప్రసాద్ కోస్టల్ బ్యాటరీ హెలిప్యాడ్ వద్ద స్వాగతం పలికారు. డేటా సెంటర్ కోసం రైతులు భూములిచ్చి ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తున్నారన్నారు. రైతుల విజ్ఞప్తిని పరిశీలించి భూ పరిహారంపై నిర్ణయం తీసుకుంటామని CM పేర్కొన్నారు.