News February 6, 2025

ఉదయగిరి: సీనియర్ అధ్యాపకుడు గుండెపోటుతో మృతి

image

ఉదయగిరి పరిసర ప్రాంతాల్లో పలు కళాశాలల్లో పనిచేసిన సీనియర్ అధ్యాపకుడు బి శ్రావణ్ కుమార్ ప్రస్తుతం ఓ ప్రైవేటు కళాశాల ప్రిన్సిపల్‌గా వ్యవహరిస్తున్నారు. గత రాత్రి దాసరిపల్లిలోని ఆయన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు. రాత్రి భోజనం తర్వాత ఛాతిలో నొప్పి రావడంతో ఉదయగిరిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆత్మకూరుకు తరలిస్తుండగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Similar News

News December 31, 2025

నెల్లూరు: దోచుకుంది రూ.23 కోట్లు.. రికవరీ రూ.1 కోటి

image

జిల్లాలో 2025లో సైబర్ క్రైమ్ పెరిగింది. ఆన్‌లైన్ వేదికగా సైబర్ నేరగాళ్లు రూ.23,57,97,426 దోచేశారు. చాలామంది ఉద్యోగాల పేరిట రూ.లక్షల్లో దోచేయగా, ఇతరత్రా విధానాల్లో పెద్ద ఎత్తున్న దోచుకున్నారు. 2025లో సైబర్ నేరగాళ్లు రూ.23.57 కోట్లు దోచుకోగా.. పోలీసులు కేవలం రూ.1.07 కోట్లు మాత్రమే రికవరీ చేశారు. ఇంకా పెద్ద ఎత్తున ఈ రికవరీ సాధించాల్సి ఉన్నా ఆ దిశగా ప్రగతి కనబర్చలేదు.

News December 31, 2025

నెల్లూరు: దోచుకుంది రూ.23 కోట్లు.. రికవరీ రూ.1 కోటి

image

జిల్లాలో 2025లో సైబర్ క్రైమ్ పెరిగింది. ఆన్‌లైన్ వేదికగా సైబర్ నేరగాళ్లు రూ.23,57,97,426 దోచేశారు. చాలామంది ఉద్యోగాల పేరిట రూ.లక్షల్లో దోచేయగా, ఇతరత్రా విధానాల్లో పెద్ద ఎత్తున్న దోచుకున్నారు. 2025లో సైబర్ నేరగాళ్లు రూ.23.57 కోట్లు దోచుకోగా.. పోలీసులు కేవలం రూ.1.07 కోట్లు మాత్రమే రికవరీ చేశారు. ఇంకా పెద్ద ఎత్తున ఈ రికవరీ సాధించాల్సి ఉన్నా ఆ దిశగా ప్రగతి కనబర్చలేదు.

News December 31, 2025

నెల్లూరు: ఉచితంగా శిక్షణ

image

నెల్లూరు జిల్లాలోని గ్రామీణనిరుద్యోగ యువతకు డీఆర్డీఏ, సీడాప్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తామని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి ఓ ప్రకటనలో తెలిపారు. నెల్లూరు, బోగోలు, కోవూరులో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. టెలికామ్, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ జాబ్స్, టూరిజం తదితర రంగాల్లో శిక్షణ ఉంటుందన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులై 18 నుంచి 28 ఏళ్లలోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి.