News June 5, 2024
ఉదయ్ శ్రీనివాస్ కు ధ్రువీకరణ పత్రం అందజేసిన ఆర్వో
కాకినాడ ఎంపీగా జనసేన నుంచి తంగేళ్ళ ఉదయ శ్రీనివాస్ భారీ మెజారిటితో విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసిన వెంటనే కాకినాడ జేఎన్టీయూలో మంగళవారం జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ జే.నివాస్ ఆయన ధ్రువీకరణ అందజేశారు.
Similar News
News October 6, 2024
సముద్రంలోకి 1,62,276 క్యూసెక్కుల మిగులు జలాలు
రాజమండ్రి రూరల్ మండల పరిధిలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి శనివారం సాయంత్రానికి 1,62,276 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేసినట్లు జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.90 అడుగులకు చేరిందని పేర్కొన్నారు. అలాగే డెల్టా కాలువలకు 14,000 క్యూసెక్కుల నీటిని వదిలామన్నారు.
News October 5, 2024
తూ.గో.జిల్లా టుడే టాప్ న్యూస్
*రాజమండ్రి కార్యకర్తకు మంత్రి లోకేశ్ భరోసా
*కాకినాడలో 8న మినీ జాబ్ మేళా
*పవన్ కళ్యాణ్ కాలయాపన చేస్తున్నారు: సీపీఐ
*అధికారులకు జిల్లా కలెక్టర్ హెచ్చరిక
*రాళ్లపాలెం: కనకదుర్గమ్మ ఆలయంలో చోరీ
*డిప్యూటి సీఎంను కలిసిన మార్క్ ఫెడ్ డైరక్టర్ నరసింహరావు
*రాజమండ్రి: పుష్కరాలకు శోభాయమానంగా కోటిలింగాల ఘాట్
*తూ.గో.జిల్లా మహిళకు నారా లోకేశ్ హామీ
*గొల్లప్రోలు: ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్డెడ్
News October 5, 2024
బాధితుడు కోలుకునేందుకు సాయం చేస్తాం: మంత్రి లోకేశ్
కాలేయ సమస్యతో బాధపడుతున్న రాజమండ్రి రూరల్ కాతేరు వాసి సానబోయిన రాంబాబు కోలుకునేందుకు అండగా నిలుస్తామని మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందించారు. 1982 నుంచి పార్టీ విధేయుడిగా పనిచేస్తున్న రాంబాబు అనారోగ్యంతో బాధపడుతున్నాడని అతని కుటుంబానికి సాయం చేయాలని జాహ్నవి స్వామి ఎక్స్లో పోస్టు చేశారు. దీంతో లోకేశ్ స్పందించి కార్యకర్తలే పార్టీకి ప్రాణమని అతనికి అండగా నిలుస్తామన్నారు.