News September 17, 2025
ఉద్యమాల పురిటి గడ్డ.. జగిత్యాల జిల్లా

నిజాం రాచరిక పాలన నుంచి విముక్తి కల్పించి HYD సంస్థానాన్ని భారత్లో విలీనం చేసేందుకు జరిగిన ఉద్యమాల్లో జగిత్యాల నుంచి ఎందరో యోధులు పాల్గొన్నారు. వారి త్యాగాల ఫలితంగా 1948 SEC 17న HYD సంస్థానం దేశంలో విలీనమైంది. 1947 AUG 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చినా HYD సంస్థానం దేశంలో అంతర్భాగం కానీ పరిస్థితుల్లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, జగిత్యాల జైత్రయాత్రకు ఇక్కడి నుంచే పునాది.
Similar News
News September 17, 2025
సంగారెడ్డి: పాఠశాలల్లో పేరెంట్-టీచర్ మీటింగ్

ఈ నెల 20న సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు బుధవారం ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యార్థుల విద్యా ప్రగతి, పాఠశాల అభివృద్ధి, ఇతర ముఖ్యమైన అంశాలపై చర్చించాలని ఆయన సూచించారు. పీటీఎంకు సంబంధించిన వివరాలను మొబైల్ యాప్లో నమోదు చేయాలని ప్రధానోపాధ్యాయులకు తెలిపారు.
News September 17, 2025
స్మార్ట్ కార్డుల్లో పేరు సరిదిద్దాం: జేసీ

అంబేడ్కర్ కోనసీమ జిల్లా పేరును స్మార్ట్ కార్డుల్లో చేర్చినట్లు జాయింట్ కలెక్టర్ టి. నిశాంతి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం తక్షణమే స్పందించిందని చెప్పారు. ఇకపై ఏ ఒక్క కార్డును స్కాన్ చేసినా, ‘అంబేడ్కర్ కోనసీమ జిల్లా’ అని కనిపిస్తుందని ఆమె స్పష్టం చేశారు. అంబేడ్కర్ అభిమానుల మనోభావాలను గౌరవించామని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.
News September 17, 2025
PM AI వీడియో తొలగించండి: పట్నా హైకోర్టు

ప్రధాని మోదీని ఆయన తల్లి మందలిస్తున్నట్టు రూపొందించిన <<17688399>>AI వీడియోను<<>> సోషల్ మీడియా నుంచి తొలగించాలని బిహార్లోని పట్నా హైకోర్టు కాంగ్రెస్ పార్టీని ఆదేశించింది. SEP 10న బిహార్ కాంగ్రెస్ మోదీపై AI వీడియో క్రియేట్ చేసి Xలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీన్ని బీజేపీ, NDA మిత్ర పక్షాలు తీవ్రంగా ఖండించాయి. దీనిపై బీజేపీ ఢిల్లీ ఎలక్షన్ సెల్ వేసిన పిటిషన్ను విచారించిన కోర్టు వీడియో తొలగించాలని ఆదేశించింది.