News August 19, 2025

ఉద్యానవన పంటల సాగుపై చైతన్య పరచాలి: కలెక్టర్

image

జిల్లాలో ఉద్యానవన పంటల సాగుకు సంబంధిత అధికారులు కృషి చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. మంగళవారం ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సంబంధిత శాఖ అధికారులతో ఆమె సమీక్షించారు. ఉద్యానవన పంటలకు అనుకూలమైన భూములను గుర్తించాలన్నారు. రైతులను ప్రోత్సహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్నారు.

Similar News

News August 20, 2025

ఎంపీడీవోలు సచివాలయాలను తనిఖీ చేయాలి: కలెక్టర్

image

జిల్లాలోని ప్రతి ఎంపీడీవో వారానికి 4 సచివాలయాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లాలోని ఎంపీడీవోలతో కలెక్టర్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మండలాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించాల్సిన ప్రధాన బాధ్యత ఎంపీడీవోలదే అన్నారు. జిల్లాలో క్లాప్ మిత్రా జీతాల సమస్య పరిష్కరించాలన్నారు.

News August 19, 2025

శ్రీశైలం ఘాట్ రోడ్డుపై ద్విచక్ర వాహనం బోల్తా.. వ్యక్తి మృతి

image

దోర్నాల-శ్రీశైలం ఘాట్ రోడ్డులో చిన్నారుట్ల సమీపంలో మంగళవారం ఓ బైక్ బోల్తా పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న కొంగా సుబ్బారెడ్డి తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఎస్సై మహేష్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీరు కడప జిల్లా సిద్ధవటం మండలానికి చెందిన వారిగా గుర్తించారు.

News August 19, 2025

‘పాస్ పుస్తకాల పంపిణీకి చర్యలు చేపట్టాలి’

image

జిల్లాలో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం పటిష్టంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని జేసీ గోపాలకృష్ణ అన్నారు. విజయవాడ సీసీఎల్ఏ కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో జేసీ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో చేపట్టిన రీ సర్వే ప్రక్రియ, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడారు.