News August 25, 2025
ఉద్యోగం పేరిట మోసం.. ఎస్పీకి ఫిర్యాదు

ప్రభుత్వ ఉద్యోగం పేరిట ఓ వ్యక్తి తమను మోసంచేసినట్లు పలువురు బాధితులు సోమవారం జిల్లా ఎస్పీ దామోదర్కు ఫిర్యాదు చేశారు. కొనకనమిట్లలో గల ఒక ప్రైవేటు ఏజెన్సీలో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగమని నమ్మించి, రూ.5 లక్షలు తీసుకొని మోసం చేసినట్లు బాధితులు వాపోయారు. 16 నెలలపాటు పనిచేసిన తర్వాత ఉద్యోగం తొలగించారని, ప్రభుత్వ ఉద్యోగమని నమ్మి తాము మోసపోయామని, న్యాయం చేయాలని వారు కోరారు.
Similar News
News August 26, 2025
విద్యార్థులు లక్ష్యసాధన చేయాలి: కలెక్టర్

ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్య సాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా విద్యార్థులకు సూచించారు. సోమవారం ఒంగోలులో వసతి గృహాలకు సంబంధించి విద్యార్థులను JD శీలం పరివర్తన భవనంలోకి షిఫ్ట్ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు.
News August 25, 2025
ఫోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష.!

ఫోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.7వేల జరిమానాను విధిస్తూ ఒంగోలు ఫోక్సో కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. నిందితుడికి జైలు శిక్ష ఖరారుకావడంలో సరైన ఆధారాలు ప్రవేశపెట్టిన పోలీసులను ఎస్పీ దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు. హనుమంతునిపాడు మండలానికి చెందిన ఓ వ్యక్తి, 2000 సంలో మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీనితో కేసు నమోదు కాగా, సదరు వ్యక్తికి మూడేళ్ల శిక్ష ఖరారైంది.
News August 25, 2025
జిల్లాలో సెప్టెంబర్ 8 వరకు నేత్రదాన పక్షోత్సవాలు

ప్రకాశం జిల్లాలో నేటి నుంచి సెప్టెంబర్ 8 వరకు జరుగు నేత్రదాన పక్షోత్సవాలను జయప్రదం చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో 40 జాతీయ పక్షోత్సవాల కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. నేత్రదానం చేయండి.. ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించండి అనే నినాదంతో కార్యక్రమం నిర్వహించాలన్నారు. మరణానంతరం 6-8 గంటల్లో నేత్రదానం చేయవచ్చని కలెక్టర్ తెలిపారు.