News July 5, 2024
ఉద్యోగ నియామక పత్రాలు అందించిన మంత్రి తుమ్మల
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720159113273-normal-WIFI.webp)
టీజీపీఎస్సీ ద్వారా ఇటీవల రిక్రూట్ అయిన 18 మంది హార్టికల్చర్ ఆఫీసర్స్కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నియామక పత్రాలు అందజేశారు. వ్యవసాయ రంగంలో మంచి మార్పులు తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
Similar News
News July 8, 2024
ఖమ్మం మార్కెట్లో పెరిగిన మిర్చి ధర
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720410973396-normal-WIFI.webp)
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.19,550 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,300 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత రోజు కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర రూ.2050 పెరగగా, పత్తి ధర మాత్రం రూ.50 తగ్గినట్లు వ్యాపారస్థులు తెలిపారు.
News July 8, 2024
మూడు పంచాయతీలుగా భద్రాచలం పంచాయతీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720415083711-normal-WIFI.webp)
భద్రాచలాన్ని మూడు పంచాయతీలుగా విభజిస్తూ రాష్ట్ర శాసనసభ ఆమోదించి పంపించిన బిల్లుపై గవర్నర్ రాధాకృష్ణన్ సంతకం చేశారు. బూర్గంపాడు మండలంలోని సారపాకను రెండు పంచాయతీలుగా ఆమోదించారు. ఇన్నాళ్లూ రెండు ప్రాంతాలు మున్సిపాలిటీగా మారతాయని పట్టణవాసులు భావించారు. కానీ భద్రాచలం పట్టణాన్ని భద్రాచలం, సీతారామనగర్, శాంతినగర్ పంచాయతీలుగా, సారపాకను సారపాక, ఐటీసీ గ్రామ పంచాయతీలుగా విభజించారు.
News July 8, 2024
గ్యాస్ బండ రాయితీకి తప్పని తిప్పలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720408850579-normal-WIFI.webp)
కొత్త సర్కారులో గ్యాస్ బండ రాయితీ వస్తుందని సంబరపడిన వినియోగదారులకు భంగపాటు తప్పడం లేదు. ఒక్కో గ్యాస్ బండకు వినియోగదారుడు సుమారు రూ.842 చెల్లిస్తున్నాడు. తర్వాత ఒకటి నుంచి ఐదు రోజుల్లో రూ.340 పైచిలుకు రాష్ట్ర ప్రభుత్వ రాయితీ సొమ్ము పడాలి. టెక్నికల్ ప్రాబ్లమ్ వలన కారేపల్లి, ఇల్లెందు తదితర మండలాల్లో అది జమకావడం లేదు. ఫలితంగా ఆయా వినియోగదారులు రాయితీ సొమ్మును కోల్పోవాల్సి వస్తోంది.