News August 19, 2025
ఉపరాష్ట్రపతి అభ్యర్థి బరిలోకి మార్కాపురం వాసి.!

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం చింతకుంటకు చెందిన డాక్టర్ మందటి తిరుపతిరెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తాజాగా ఆయన సమర్పించిన నామినేషన్కు ఆమోదం సైతం లభించింది. సుప్రీంకోర్టు న్యాయవాదిగా గుర్తింపు పొందిన తిరుపతిరెడ్డి 2022లో జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఎన్నికలు జరుగుతుండగా మరోమారు నామినేషన్ వేశారు.
Similar News
News August 19, 2025
ప్రకాశం: పునుగోడు చెరువులో పడి ఇద్దరు మృతి

ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలోని పునుగోడు చెరువులో పడి ఇద్దరు మృతి చెందిన ఘటన మంగళవారం జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న SI శ్రీరామ్ సిబ్బందితో కలిసి చెరువులోని మృతదేహాలను వెలికితీశారు. మృతిచెందిన వారు ఎవరనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. కొద్దిసేపట్లో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కనిగిరికి తరలించే అవకాశం ఉంది. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
News August 19, 2025
ఉపరాష్ట్రపతి అభ్యర్థి బరిలోకి మార్కాపురం వాసి.!

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం చింతకుంటకు చెందిన డాక్టర్ మందటి తిరుపతిరెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తాజాగా ఆయన సమర్పించిన నామినేషన్కు ఆమోదం సైతం లభించింది. సుప్రీంకోర్టు న్యాయవాదిగా గుర్తింపు పొందిన తిరుపతిరెడ్డి 2022లో జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఎన్నికలు జరుగుతుండగా మరోమారు నామినేషన్ వేశారు.
News August 19, 2025
నోరు మెదపని అధికారులు: ప్రకాశం కలెక్టర్ సీరియస్

సరైన సమాచారం లేకుండా వీడియో కాన్ఫరెన్స్కు హాజరుకావడంపై పలువురు కమిషనర్లు, MPDOల తీరుపై జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ పలు శాఖలు చేపడుతున్న పనులపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రశ్నలకు పలువురు అధికారులు తెల్లముఖం పెట్టడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.