News September 9, 2025
ఉపరాష్ట్రపతి ఎన్నిక: ఓటేసిన ఎంపీ అర్వింద్

ఉపరాష్ట్రపతి ఎన్నికకు మంగళవారం ఓటింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో MP అర్వింద్ ధర్మపురి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్ భవనంలోని ‘F-101 వసుధ’లో రహస్య బ్యాలెట్ విధానంలో ఆయన ఓటేశారు.
Similar News
News April 5, 2026
సిరికొండ: చెరువులో చేపలు పట్టడానికి వెళ్లి వ్యక్తి మృతి

సిరికొండ మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. శనివారం మధ్యాహ్నం సర్పల్లితండాకు చెందిన మాలవత్ రమేశ్ చేపలు పట్టేందుకు వెళ్లి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణ ఆదివారం తెలిపారు.
News April 5, 2026
NZB: జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత ఎక్కడంటే!

గడచిన 24 గంటల్లో నిజామాబాద్ జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. వేంపల్లె, నిజామాబాద్ సౌత్ 40.1°C, కోటగిరి 40°Cల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా జిల్లాలోని అన్నిప్రాంతాల్లో 35°Cలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యి. ఉక్కపోతతో జనాలు ఉక్కిరిబిక్కిరయ్యారు. నిన్న సాయంత్రం జిల్లాలో పలుచోట్ల వర్షపాతం నమోదయ్యింది. జానకంపేటలో 26.8 మి.మీ, సిరికొండ, సాలూరలో 10 మి.మీ. వర్షం కురిసింది.
News April 5, 2026
NZB: హస్తంలో రగులుతున్న రాజకీయ సెగలు

నిజామాబాద్ కాంగ్రెస్లో రాజకీయ సెగలు రేగుతున్నాయి. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడుతున్న ధర్మపురి సంజయ్కు పదవుల పంపకంలో అన్యాయం జరిగిందని ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తగిన గుర్తింపు దక్కడం లేదని ఆగ్రహంతో ఉన్న అభిమానులు, నగరంలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ధర్నాకు దిగారు. బలమైన ఓటు బ్యాంకు కలిగిన నేత కావడంతో, ఆయన పార్టీ వీడితే నష్టం తప్పదని కేడర్ ఆందోళన చెందుతోంది.


