News April 4, 2025
ఉపాధ్యాయులను ఎక్కువ ప్రశ్నలు అడగాలి: కలెక్టర్

ఉపాధ్యాయులను ఎక్కువ ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి విద్యార్థులకు సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఇస్లామియా కళాశాలలో కొనసాగుతున్న అల్పసంఖ్యాకుల బాలికల గురుకుల పాఠశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 5వ తరగతి విద్యార్థులతో కాసేపు కలెక్టర్ ముచ్చటించారు. రోజు న్యూస్ పేపర్ చదివి వార్తలు తెలుసుకోవాలని అన్నారు. పాఠశాలలో మెనూ పాటించాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News November 12, 2025
ఉగ్రవాదులను చట్టం ముందు నిలబెడతాం: కేంద్రం

ఢిల్లీ పేలుడు మృతులకు కేంద్ర క్యాబినెట్ సంతాపం తెలిపింది. ఇది ఉగ్రవాద చర్య అని అధికారికంగా ప్రకటించింది. ఉగ్రవాదులను చట్టం ముందు నిలబెడతామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ‘దర్యాప్తును అత్యవసరంగా నిర్వహించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఉగ్రవాదులు, వారి స్పాన్సర్లను గుర్తించి, బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించింది’ అని తెలిపారు. పరిస్థితిని అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.
News November 12, 2025
సింహాద్రి అప్పన్న హుండీ ఆదాయం రూ.1.95కోట్లు

సింహాద్రి అప్పన్నకు భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలను ఆలయ అధికారులు బుధవారం లెక్కించారు. ఈఓ సుజాత పర్యవేక్షణలో ఈ లెక్కింపు ప్రక్రియ జరిగింది. 28 రోజులకుగాను మొత్తం రూ.1,95,27,442 ఆదాయం వచ్చింది. బంగారం 83 గ్రా.100 మిల్లీగ్రాములు, వెండి 11 కిలోల 200 గ్రా, 17 దేశాల విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినట్లు తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, సేవా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
News November 12, 2025
జంక్షన్ల అభివృద్ధి పనులను వెంటనే మొదలు పెట్టండి: మేయర్

జంక్షన్ల అభివృద్ధి పనులను వెంటనే మొదలు పెట్టాలని నగర మేయర్ గుండు సుధారాణి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. నగరంలో నూతనంగా ఉర్సుగుట్ట, హన్మకొండ చౌరస్తా, సెంట్రల్ లైబ్రరీ ప్రాంతాల్లో జంక్షన్లు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో బుధవారం మేయర్ క్షేత్ర స్థాయిలో సందర్శించి సమర్థవంతంగా ఏర్పాటు చేసేందుకు అధికారులకు తగిన సూచనలు చేశారు. పనులను వెంటనే చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను మేయర్ ఆదేశించారు.


