News February 11, 2025

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలంటే..!

image

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలో పీఆర్టీయూ ప్రతినిధులు అవగాహన కల్పిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల అధికారి ఇచ్చిన పెన్ను మాత్రమే వినియోగించాలి. ప్రాధాన్యత క్రమంలో అభ్యర్థి పేరుకు ముందు 1 అంకె వేయాలి. తర్వాత 2, 3, 4, 5 ఇలా ఎన్ని అంకెలైనా వేయవచ్చు. 1 అంకె వేయకుండా మిగిలిన అంకెలు వేస్తే ఆ ఓటు చెల్లుబాటు కాదు. టిక్కు పెట్టినా ఓటు చెల్లుబాటు కాదు.

Similar News

News October 29, 2025

తుఫాను అనంతర చర్యలు వేగవంతం చేయాలి: కలెక్టర్

image

తుఫాను అనంతర చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. సంబంధిత అధికారులతో బుధవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. పారిశుధ్య లోపం లేకుండా చూడాలన్నారు. పునరావాస కేంద్రాలలో కూడా పారిశుధ్య పనులు కొనసాగాలని స్పష్టం చేశారు. ఎక్కడా నీరు నిలువ ఉండరాదని అన్నారు. కాలువల్లో పూడిక తీసి డ్రైన్ లను క్లియర్ చేయాలని చెప్పారు. విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని సూచించారు.

News October 29, 2025

అజహరుద్దీన్‌కు మంత్రి పదవి

image

ఎల్లుండి తెలంగాణ మంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. నిన్న అజహరుద్దీన్, ఆయన కుమారుడు అసదుద్దీన్‌తో భేటీలో సీఎం రేవంత్ మంత్రి పదవిని ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గంలో మైనారిటీలు లేకపోవడంతో అవకాశం ఇచ్చినట్లు సమాచారం. MLCగా అజహరుద్దీన్ పేరును ప్రభుత్వం ఇప్పటికే గవర్నర్ వద్దకు పంపింది. దానికి ఆమోదం తెలపాల్సి ఉంది.

News October 29, 2025

ములుగు: భారీ వర్షాలు.. టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు

image

తుఫాను ప్రభావం వల్ల రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ రైతులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. వర్షాల దృశ్య తక్షణ సహాయం కోసం కలెక్టరేట్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నంబర్ 1800 4257109 ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 24 గంటలు అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు.