News March 29, 2025

ఉప్పలగుప్తంలో విద్యుదాఘాతంతో యువకుడు మృతి

image

మండల కేంద్రం ఉప్పలగుప్తంలో విద్యుదాఘతంతో యువకుడు మృతి చెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాలు ప్రకారం, ఉప్పలగుప్తం మధురపేటకు చెందిన యువకుడు మధుర రాజేష్ (30) శుక్రవారం సాయంత్రం సాగు చేస్తున్న పొలానికి వెళ్తుండగా అకస్మాత్తుగా విద్యుత్ వైర్లు తగిలి సొమ్మసిల్లి పడిపోయాడు పీహెచ్సీకి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం అమలాపురం తరలిస్తుండగా దారిలోనే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Similar News

News December 17, 2025

గోదావరి జిల్లాల్లో మొదలైన సంక్రాంతి సందడి..!

image

గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సందడి మొదలైపోయింది. పందెం రాయుళ్లు కోడి పందేలకు సిద్ధం అవుతున్నారు. ఈసారి రూ.కోట్లలో పందేలు జరగడం ఖాయం అనే వాదన బలంగా వినిపిస్తుంది. ఎక్కడ ఎలా బరులు ఏర్పాటు చెయ్యాలి..? ఎవరు ఎవరితో సిండికేట్ అవ్వాలి..? వీఐపీలు, పందెం కాసే వారికి ఎలాంటి మర్యాదలు చెయ్యాలి..? పందేల నిర్వహణ ఎలా జరపాలనే అంశాలపై పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు పందెం రాయుళ్లు చర్చించుకుంటున్నారు.

News December 17, 2025

ధనుర్మాసం: రెండవరోజు కీర్తన

image

‘భాగ్యవంతులైన గోకుల గోపికలారా! ఈ ధనుర్మాస వ్రతంలో మన కర్తవ్యం నారాయణుని పాదాలను కీర్తించడం. వ్రత కాలంలో ఇతర విషయాలు తలవకుండా, పాలు, నేతిని తాగడం, కంటికి కాటుక, సిగలో పూలు ధరించడం వంటివి మానేయాలి. శాస్త్ర విరుద్ధ పనులు చేయరాదు. చాడీలు చెప్పవద్దు. సన్యాసులు, బ్రహ్మచారులకు దానాలు చేయాలి. మనకు మోక్షాన్ని ఇచ్చే ఇతర మార్గాలన్నీ సంతోషంగా ఆచరించాలి. ధనుర్మాసమంతా ఈ నియమాలనే పాటించాలి’. <<-se>>#DHANURMASAM<<>>

News December 17, 2025

మెదక్: నాడు భర్త ఉప సర్పంచ్.. నేడు భార్య సర్పంచ్

image

గత ఎన్నికలలో గెలిచి భర్త పాలకవర్గంలో ఉప సర్పంచ్‌గా సేవలు అందించగా నేడు భార్య సర్పంచ్‌గా గెలిచి సేవలు అందించనున్నారు. మనోహరాబాద్ మండలంలోని చెట్ల గౌరారంలో సర్పంచ్‌గా చింతకింది దివ్య గెలుపొందారు. ఒకే కుటుంబంలో భర్త, భార్య గెలిచి నిలిచారు.