News June 28, 2024
ఉప్పల్లో నల్గొండ జిల్లా నిరుద్యోగి సూసైడ్

ఉద్యోగం రాకపోవడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన HYD ఉప్పల్ PS పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి వాసి వెంకట రాముడు(21) HYDకు ఉద్యోగం కోసం వచ్చాడు. ఎంత తిరిగినా జాబ్ రాకపోవడంతో డిప్రెషన్లోకి వెళ్లాడు. ఈ క్రమంలో రామాంతాపూర్లోని తన బావమరిది సాయికిరణ్ ఇంటికి వచ్చి తండ్రికి ఫోన్ చేశాడు. పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపి చనిపోయాడు.
Similar News
News December 26, 2025
NLG: రైతన్నకు ‘యాప్‘ సోపాలు..!

జిల్లాలో రైతన్నలకు ‘ఫర్టిలైజర్ బుకింగ్ యాప్’తో కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే జిల్లాలో యాసంగిలో 6.57 లక్షల ఎకరాల్లో అధికారులు సాగు అంచనా వేశారు. జిల్లాలో ఎరువులను అందుబాటులో ఉంచాల్సిందిపోయి. ఈ కొత్త యాప్ పనిచేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రారంభించిన తొలిరోజు నుంచి సరిగ్గా పనిచేయకపోవడంతో యాసంగిలో కష్టాలు తప్పేలా లేవనే వాదనలు వినిపిస్తున్నాయి.
News December 26, 2025
NLG: సీఎం ప్రకటన.. సర్పంచులకు ఊరట!

నిధులు లేక నీరసించిన పంచాయతీలకు సీఎం రేవంత్ రెడ్డి తీపి కబురు అందించారు. స్పెషల్ డెవలప్మెంట్ నిధులను నేరుగా సర్పంచ్లకే అందిస్తామని ఆయన ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా చిన్న జీపీలకు రూ.5 లక్షలు, పెద్ద జీపీలకు రూ.10 లక్షలు అందిస్తామని సీఎం ప్రకటించడంతో సర్పంచ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 1,779 గ్రామపంచాయతీలకు లబ్ధి చేకూరనున్నది.
News December 26, 2025
NLG: నక్సల్ ఉద్యమంలోకి వెళ్ళింది అప్పుడే..!

పాక చంద్రయ్య, పాపమ్మ దంపతుల ఆరుగురు సంతానంలో హనుమంతు (గణేష్) మొదటివారు. ఆయన 1960లో జన్మించారు. హనుమంతుకు ముగ్గురు చెల్లెళ్లు, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. అందరికంటే పెద్దవాడైన హనుమంతు నల్గొండలో డిగ్రీ చేస్తూ రాడికల్ యూనియన్లో పనిచేశారు. 45 ఏళ్ల క్రితం ఏచూరి శ్రీనివాస్ అనే ఏబీవీపీ నాయకుని హత్యలో ఆయన కీలకపాత్ర పోషించినట్లు చెబుతారు. అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన నక్సలైట్ ఉద్యమంలో చేరారు.


