News May 19, 2024

ఉప్పల్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

image

ఉప్పల్ స్టేడియంలో ఆదివారం SRH- కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు రాచకొండ CP తరుణ్ జోషి తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 10:30 గంటల వరకు స్టేడియం పరిసర ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు. చెంగిచెర్ల, బోడుప్పల్, పీర్జాదిగూడ నుంచి ఉప్పల్‌కు వచ్చే వాహనాలు HMDA భగాయత్ రోడ్డు వైపు దారి మళ్లిస్తామన్నారు.

Similar News

News October 4, 2024

నాంపల్లి: ఈ నెల 13న ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అలయ్ బలయ్

image

ఈ నెల 13న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అలయ్ బలయ్ నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వహణ కమిటీ ఛైర్‌పర్సన్ బండారు విజయలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు వివిధ రాష్ట్రాల గవర్నర్లను, కేంద్ర మంత్రులను కూడా ఆహ్వానించినట్లు విజయలక్ష్మి చెప్పారు.

News October 4, 2024

HYD: KTR.. SORRY చెప్పాలి: శ్రీనివాస్

image

మాజీ మంత్రి KTR వెంటనే మంత్రి కొండా సురేఖకు సారీ చెప్పాలని TPCC ప్రధాన కార్యదర్శి చెకోలేకర్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. HYD బషీర్‌బాగ్ చౌరస్తాలో ఆయన మాట్లాడుతూ.. KTR తరచూ మహిళా ప్రజాప్రతినిధులను కించ పరుస్తున్నాడని మండిపడ్డారు. ఆయన తన BRS పార్టీ సోషల్ మీడియా ద్వారా కొండా సురేఖను ట్రోలింగ్ చేయిస్తున్నారని ఆరోపించారు. గతంలోనూ మంత్రి సీతక్కపై నోరు పారేసుకున్నారని ఫైర్ అయ్యారు.

News October 4, 2024

HYD: ఈ నెల 13న ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అలయ్ బలయ్

image

ఈ నెల 13న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అలయ్ బలయ్ నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వహణ కమిటీ ఛైర్‌పర్సన్ బండారు విజయలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు వివిధ రాష్ట్రాల గవర్నర్లను, కేంద్ర మంత్రులను కూడా ఆహ్వానించినట్లు విజయలక్ష్మి చెప్పారు.