News February 7, 2026
ఉప్పల్లో రేపు మెగా సెమినార్

బాల్యం తర్వాత కొత్త జీవితంలోకి తొలి అడుగు వేసేది 10th క్లాస్ తర్వాతే. అలాంటి కీలకమైన దశలో స్టూడెంట్స్తోపాటు వారి తల్లిదండ్రులు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునేలా Way2News& Resonance సంస్థ సంయుక్తంగా ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాయి. ఉప్పల్ భగాయత్లోని SriRasthu Conventionలో రేపు ఉదయం 10:30 గంటలకు జరిగే ఈ సదస్సులో CBI EX జేడీ లక్ష్మీనారాయణ పాల్గొని మార్గనిర్దేశం చేయనున్నారు
Similar News
News February 10, 2026
HYD: దోమలు నిద్రపోనివ్వడం లేదు!

సిటీలో IT అంటే సాఫ్ట్వేర్ అనుకుంటే పొరపాటే.. ఇప్పుడు అది ‘ఇంటెన్సివ్ టెర్రర్’గా మారింది. మణికొండ, నార్సింగి ప్రాంతాల్లో దోమల దండయాత్ర మామూలుగా లేదు. 2024లో ఇక్కడి గేటెడ్ కమ్యూనిటీలు ప్రైవేట్ ఫాగింగ్ కోసం నెలకు లక్షన్నర ఖర్చు చేస్తే ఇప్పుడు మూడున్నర లక్షలకు చేరింది. పేరుకే హైటెక్ సిటీ కానీ.. పక్కనే ఉన్న ఖాళీ ప్లాట్లు దోమల ఫ్యాక్టరీలుగా మారాయి. మున్సిపల్ మందులకు ఈ దోమలు చావట్లేదట మరి!
News February 10, 2026
HYD: జ్యోతిర్లింగాల దర్శనం.. FEB 21 నుంచి షురూ

దివ్య దక్షిణ యాత్ర, జ్యోతిర్లింగాల దర్శనం ప్రత్యేక రైలు టూర్ FEB 21 నుంచి 7 రాత్రులు, 8 రోజుల పాటు సాగనుంది. ఈ యాత్రలో అరుణాచలం, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, తిరువనంతపురం, త్రిచీ, తంజావూరు వంటి పవిత్ర క్షేత్రాలను దర్శంచుకోవచ్చు. సికింద్రాబాద్ నుంచి ట్రైన్ సదుపాయం ఉంది. పెద్దలకు రూ.14,700లు, 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు రూ.13,800ల టికెట్ ధరను అధికారులు నిర్ణయించారు. SHARE IT.
News February 10, 2026
HYD: కాగితాల్లో తగ్గుదల.. వాడల్లో జ్వరాల హోరు!

HYDలో డెంగ్యూ తగ్గిందని సర్కార్ లెక్కలు చెబుతున్నా గల్లీల్లో జనం జ్వరాలతో మంచం పడుతున్నారు. 2024లో 2,806గా ఉన్న కన్ఫర్మ్డ్ డెంగ్యూ కేసులు 2025లో 1,976కు తగ్గాయని అధికారులు చెబుతున్నారు. అయితే, 2021లో 220గా ఉన్న సస్పెక్టెడ్ చికెన్ గున్యా కేసులు 2025 నాటికి ఏకంగా 13,500 దాటి 60 రెట్లు పెరిగాయని అధికారిక నివేదికలు తెలుపుతున్నాయి. 2026 ప్రారంభంలోనే <<19102369>>కోరంటిలో OP<<>> రోజుకు 700 దాటడం గమనార్హం.


