News April 25, 2024

ఉప్పల్: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

image

విదేశాల్లో ఉన్నత చదువుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఓ <<13106495>>యువకుడిని మృత్యువు<<>> వెంటాడింది. మేడిపల్లిలోని సత్యనారాయణపురానికి చెందిన మధుసూదన్ రెడ్డి, సుష్మ దంపతుల కుమారుడు వర్షిత్ రెడ్డి (23) బీటెక్ పూర్తి చేశాడు. మంగళవారం నారాయణగూడలోని ఓ బ్యాంకులో స్టేట్‌మెంట్ తీసుకునేందుకు బైకుపై బయలుదేరాడు. నల్లచెరువు ప్రాంతంలో బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. వెనక నుంచి వచ్చిన బస్సు మీది నుంచి వెళ్లగా మృతి చెందాడు.

Similar News

News September 12, 2025

HYD: నకిలీ ఐటీసీ కుంభకోణం.. ఈడీ దాడులు

image

నకిలీ ఐటీసీ కుంభకోణంపై తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో 10 చోట్ల ED దాడులు చేస్తుంది. హైదరాబాద్‌, మేడ్చల్‌ జిల్లాలో ఈడీ సోదాలు నిర్వహించింది. కోట్లాది రూపాయల నకిలీ ఇన్‌వాయిసులు, కాగితాలపైనే వ్యాపారం చేశారు. షెల్‌ కంపెనీల ఖాతాల ద్వారా రూ.650 కోట్లు బదిలీలు చేశారు. మేలో అరెస్టైన శివకుమార్‌ ప్రధాన లబ్ధిదారుడని ఈడీ గుర్తించింది. మరికొందరు వ్యక్తులు, సంస్థలపై ఈడీ దర్యాప్తు చేస్తుంది.

News September 12, 2025

HYD: BRO ట్రాఫిక్ ఉల్లంఘిస్తే మెసేజ్ చేయండి

image

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఉల్లంఘన జరిగితే ఒక్క వాట్సాప్ మెసేజ్ చేస్తే చాలని పోలీసులు తెలిపారు. హెల్మెట్ ధరించకపోవడం, రాంగ్ రూట్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ వంటి వాటిపై సైతం ఫిర్యాదు చేసే అవకాశం ఉందన్నారు. ఎలాంటి ట్రాఫిక్ ఉల్లంఘన జరిగినా.. 9490617346కు వాట్సప్ ద్వారా లొకేషన్, డిటైల్స్ ఎంటర్ చేసి, ఫొటోతో పంపాలన్నారు. ఓ వ్యక్తి ఇటీవల హెల్మెట్ ధరించకపోవడంపై అధికారులు స్పందించారు.

News September 12, 2025

ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వాలి: గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

image

సైన్స్, టెక్నాలజీ రంగాలలో దేశం గ్లోబల్ లీడర్‌గా నిలవాలంటే పరిశోధన, నూతన ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణం కల్పించాలని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. హైదరాబాద్‌లోని CSIR–IICTలో జరిగిన ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్’ ఆరో ప్రాంతీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. పరిశోధనల ప్రోత్సాహం దేశ ప్రగతికి ఎంతగానో తోడ్పడుతుందని వివరించారు.