News February 9, 2025

ఉప్పల్ MLA ఇంట్లో విషాదం

image

ఉప్పల్ MLA బండారి లక్ష్మారెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు బండారి వెంకట్ రెడ్డి సతీమణి పద్మ సాయంత్రం కన్నుమూశారు. రేపు కీసర మండలం చీర్యాల వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు. ఉదయం 11 గంటలకు అంతిమయాత్ర సైనిక్‌పురి నుంచి మొదలవనుంది. ఫిబ్రవరి 15న MLA లక్ష్మారెడ్డి కూతురు వివాహం ఉండడం, ఇంతలోనే ఆయన వదిన మృతి చెందడంతో ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.

Similar News

News February 10, 2025

HYD: నుమాయిష్‌కు 80వేల మంది

image

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరుగుతున్న నుమాయిష్‌కు సందర్శకులు భారీగా తరలివెళ్తున్నారు. జనవరి 3న ప్రారంభమైన నుమాయిష్‌కు లక్షల సంఖ్యలో సందర్శకులు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆదివారం సెలవు దినం కావడంతో 80 వేల మంది నుమాయిష్‌ను సందర్శించినట్లు పేర్కొన్నారు. కాగా.. ఈనెల 15న నమాయిష్ ముగియనుంది.

News February 10, 2025

రంగారెడ్డి జిల్లా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా

image

రంగారెడ్డి జిల్లా కనిష్ట ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. రెడ్డిపల్లిలో 14.2℃, తాళ్లపల్లి 14.5, చందనవెల్లి 14.7, చుక్కాపూర్‌ 14.8, ఎలిమినేడు, కాసులాబాద్‌ 15.5, రాజేంద్రనగర్ 15.7, రాచలూరు, కేతిరెడ్డిపల్లి, తొమ్మిదిరేకుల 15.9, కొందుర్గ్, వెల్జాల 16.1, ప్రోద్దటూర్, సంగెం 16.3, వైట్‌గోల్డ్ SS 16.4, కడ్తాల్, మంగళపల్లి 16.5, యాచారం, మీర్‌ఖాన్‌పేట 16.7, హైదరాబాద్ విశ్వవిద్యాలయం, కందువాడలో 16.8℃గా నమోదైంది.

News February 10, 2025

శంషాబాద్ నుంచి కుంభమేళాకు తరలివెళ్తున్న ప్రజలు

image

ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు భారీగా ప్రజలు తరలివెళ్తున్నారు. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులు వృద్ధులు, దివ్యాంగుల కోసం చక్రాల కుర్చీలను ఏర్పాటు చేశారు. ఆదివారం అంతర్జాతీయ విమాన సర్వీసులో 84,593 మంది ప్రయాణించినట్లు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు.

error: Content is protected !!