News October 30, 2025
ఉప్పునుంతలలో అత్యధిక 63.4 మీ. మీ వర్షపాతం

తుఫాను కారణంగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు ఉప్పునుంతల మండలంలో 63.4. మిల్లి మీటర్ల వర్షపాతం నమోదయిందని జిల్లా అధికారులు తెలిపారు. ఈ వర్షం కారణంగా చెరువులు కుంటలు నిండి అలుగుబరాయి. వర్షం కారణంగా ఉప్పునుంతల మండలంలో ఓ వ్యక్తి నీటిలో కొట్టుకు వచ్చి చనిపోయాడు. గేదెలు మేకలు సైతం మృత్యువాత పడ్డాయి. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు.
Similar News
News October 30, 2025
SEBIలో 110 పోస్టులు… నేటి నుంచే దరఖాస్తుల ఆహ్వానం

SEBI 110 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. అర్హత గలవారు NOV 28 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి మాస్టర్ డిగ్రీ లేదా PG డిప్లొమా, LLB, BE, బీటెక్, CA, CFA, MCA, MSC(CS), MA( హిందీ/ ఇంగ్లిష్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఫేజ్ 1 రాత పరీక్ష JAN 10న, ఫేజ్ 2 రాత పరీక్ష FEB 21న నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ తేదీని తర్వాత ప్రకటిస్తారు. వెబ్సైట్: sebi.gov.in
News October 30, 2025
బాధితులకు అండగా ఉండండి: వరంగల్ కలెక్టర్

భారీ వర్షాల ప్రభావంతో జలదిగ్బంధంలో ఉన్న ఎన్ఎన్ నగర్ ప్రాంతాన్ని కలెక్టర్ డాక్టర్ సత్య శారదా స్వయంగా సందర్శించారు. వరద బాధితులను పరామర్శించి వారి సమస్యలను ఆరా తీశారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న అధికారులను మార్గనిర్దేశం చేస్తూ తక్షణ సహాయం అందించాలని సూచించారు. బాధితులకు అవసరమైన ఆహారం, నీరు, వైద్య సదుపాయాలు అందించాలంటూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
News October 30, 2025
మోత్కూర్ ప్రమాదవశాత్తు విద్యుత్ శాఖ ఉద్యోగి మృతి

మోత్కూర్ మండలం దత్తప్పగూడెంకి చెందిన విద్యుత్ హెల్పర్ ఓర్సు సురేష్ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. ఓ రైతు పొలంలో ట్రాన్స్ఫార్మర్ కూలడంతో విద్యుత్ లైన్ సరిచేస్తుండగా, ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కొట్టింది. వెంటనే భువనగిరి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సురేష్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.


