News April 12, 2024

ఉప్పునుంతల: ఉపాధి కూలీల ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్‌పై కేసు

image

ఉప్పునుంతల మండలం కంసానిపల్లిలో నిన్న ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో దాదాపు 17 మంది ఉపాధి కూలీలు గాయాలయ్యాయి. ఘటనలో బాధితురాలు పద్మ ఫిర్యాదుతో ట్రాక్టర్ డ్రైవర్ ఆంజనేయులుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై లెనిన్ తెలిపారు. డ్రైవర్ అజాగ్రత్తతోనే ప్రమాదం జరిగిందన్నారు. ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ ఆస్పత్రికి వెళ్లి క్షత్రగాత్రులకు వైద్య సేవలందించారు. గాయపడిన కూలీలను మాజీ ఎమ్మెల్యే గువ్వల పరామర్శించారు.

Similar News

News October 10, 2024

మహబూబ్‌నగర్‌లో అతిపెద్ద అంతర్జాతీయ విద్యా సదస్సు

image

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలకునే విద్యార్థుల కోసం మన మహబూబ్‌నగర్‌లో వన్ విండో, జయప్రకాశ్ నారాయణ్ ఇంజినీరింగ్ కళాశాల వారు సంయుక్తంగా సదస్సు నిర్వహించనున్నారు. స్థానిక సుదర్శన్ కన్వెన్షన్ హాల్‌లో ఈనెల 11న నిర్వహించనున్న ఈ అంతర్జాతీయ విద్యా సదస్సులో పాల్గొన దలచిన వారు <>https://bit.ly/MBNRFAIR24<<>> లింకు ద్వారా ఉచితంగా తమ పేరు నమోదు చేసుకుని విదేశీ విద్యా సంస్థల ప్రతినిధులతో నేరుగా మాట్లాడవచ్చు.

News October 10, 2024

కొడంగల్: నాన్నకు ప్రేమతో..!

image

కొడంగల్ మండలం హుస్నాబాద్‌కు చెందిన శ్రీశైలం గౌడ్ డీఎస్సీ సాధించేందుకు నిరంతరం శ్రమించి రైతుగా మిగిలిపోయాడు. తండ్రి కలను సాకారం చేసేందుకు ఆయన ఇద్దరు కుమార్తెలు సుధ, శ్రీకావ్య డీఎస్సీ కోసం రోజూ 14 నుంచి 18 గంటల పాటు కష్టపడ్డారు. సుధ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్‌లో రెండో ర్యాంకు, ఫిజికల్ సైన్స్‌లో మొదటి ర్యాంకు సాధించగా.. శ్రీకావ్య ఎస్‌జీటీగా ఎంపికైంది. దీంతో గ్రామస్థులు అభినందించారు.

News October 10, 2024

ఉమ్మడి జిల్లా నేటి వర్షపాత వివరాలు ఇలా…

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా భద్రలో 27.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్నగర్ జిల్లా కొత్తమోల్గారాలో 21.5 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా మరికల్లో 18.0 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా రేవల్లిలో 17.8 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా వడ్డేపల్లిలో 5.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.