News December 16, 2025
ఉప సర్పంచ్గా మెదక్ ఎంపీ కారు డ్రైవర్

మెదక్ MP రఘునందన్ రావు కార్ డ్రైవర్గా పనిచేస్తున్న సాయి చరణ్ ఉపసర్పంచ్గా ఎన్నికయ్యాడు. రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో సిద్దిపేట రూరల్ మండలం రాంపూర్ గ్రామంలో మొదటి వార్డు సభ్యుడిగా పోటీ చేసి గెలిచాడు. ఆ తర్వాత గ్రామంలోని వార్డు సభ్యుల సహకారంతో ఉపసర్పంచ్గా ఎన్నుకున్నారు. గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు సాయి చరణ్ను అభినందించారు.
Similar News
News December 18, 2025
RR: 3 ఫేజుల్లో.. ముగ్గురు లక్కీ సర్పంచ్లు

రంగారెడ్డి జిల్లాలో 3విడతల్లో లక్కీగా సర్పంచ్ పీఠం ముగ్గురిని వరించింది. 1st ఫేజ్లో కొందర్గు చిన్నఎల్కిచర్లలో ఇద్దరికి సమాన ఓట్లురాగా టాస్తో రాజు గెలిచారు. 2nd ఫేజ్లో చేవెళ్ల గుండాలలో నరాలు తెగే ఉత్కంఠలో ఒక్క ఓటుతో బుచ్చిరెడ్డి గెలిచారు. 3rd ఫేజ్లో యాచారం తులేఖుర్దులో ఇద్దరికి సమాన ఓట్లు రాగా ఉద్రిక్తతకు దారితీస్తుందని గమనించిన పోలీసులు పరిస్థితి అదుపుచేయగా రికౌంటింగ్లో రమేశ్ గెలుపొందారు.
News December 18, 2025
పల్నాడు: వైద్యుల నిర్లక్ష్యం.. ప్రాణం కోల్పోయిన గర్భిణీ

నరసరావుపేట ప్రభుత్వాసుపత్రిలో విషాద ఘటన చోటు చేసుకుంది. రెంటచింతల మండలానికి చెందిన సాగరమ్మ (21) ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరగా, ఆపరేషన్ అనంతరం వైద్యులు ‘O పాజిటివ్’ బదులు ‘A పాజిటివ్’ రక్తం ఎక్కించినట్లు సమాచారం. దీంతో ఆమె పరిస్థితి విషమించి మగబిడ్డకు జన్మనిచ్చి కన్నుమూసింది. రక్తం గ్రూపు మార్చి ఎక్కించడం వల్లే మృతి చెందిందని బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
News December 18, 2025
పొగచూరిన ఢిల్లీ.. విమానాలు, రైళ్లు ఆలస్యం

ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి బయల్దేరాల్సిన 40 విమానాలు ఆలస్యమయ్యాయి. అటు ఫాగ్ వల్ల 22 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రోడ్డుపై వచ్చిపోయే వాహనాలేవీ కనిపించడంలేదు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో ప్రయాణికులు నెమ్మదిగా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా నిన్న లక్నోలో పొగ మంచు వల్ల భారత్-సౌతాఫ్రికా టీ20 మ్యాచ్ కూడా రద్దయిన విషయం తెలిసిందే.


