News May 11, 2024
ఉభయ గోదావరి జిల్లాల్లోనే పిఠాపురంపై ఆసక్తి.. నేడు రామ్చరణ్

ప్రచారఘట్టానికి నేటి సాయంత్రంతో తెరపడనుండగా.. ఉభయ గోదావరి జిల్లాల్లోనే పిఠాపురం క్లైమాక్స్ ఆసక్తికరంగా మారింది. సీఎం జగన్ వంగా గీతకు మద్దతుగా ప్రసంగించి ఇక్కడే ప్రచారానికి ఫిన్షింగ్ టచ్ ఇవ్వనున్నారు. అటు గ్లోబల్ స్టార్ రామ్చరణ్ సైతం తన తల్లి సురేఖతో కలిసి పిఠాపురం వచ్చి పూజలు చేయనున్నారు. అనంతరం బాబాయ్ కళ్యాణ్ కోసం అబ్బాయ్ చరణ్ ప్రచారం చేస్తారా..?, ఏమైనా మాట్లాడుతారా..? అనేది ఆసక్తికరంగా మారింది.
Similar News
News January 1, 2026
భీమవరం: కేంద్ర మంత్రి వర్మకు న్యూఇయర్ శుభాకాంక్షలు

కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మను గురువారం ఆయన కార్యాలయంలో పలువురు ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, కలెక్టర్ చదలవాడ నాగరాణి, జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తదితరులు మంత్రికి పుష్పగుచ్ఛాలు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధి, పలు ప్రజాహిత అంశాలపై వారు చర్చించారు.
News January 1, 2026
ప.గో: లక్ష్యం1,780.. కట్టింది ఏడే

కాళ్ల మండలం పెదమిరం క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ నాగరాణి గృహ నిర్మాణాలపై సమీక్షించారు. పీఎంఏవై 1.0 (ఆప్షన్-3) కింద 2025 డిసెంబర్ నాటికి 1,780 ఇళ్లు నిర్మించాల్సిన ‘అజాయ వెంచర్స్’ సంస్థ.. కేవలం 7 మాత్రమే పూర్తి చేయడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒప్పందం ప్రకారం లక్ష్యం చేరుకోనందున సదరు నిర్మాణ సంస్థపై పోలీసు కేసు నమోదు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.
News January 1, 2026
తణుకు: దంపతులను ఢీ కొట్టిన లారీ.. భార్య మృతి

తణుకు మండలం తేతలి జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందారు. తణుకు మండలం వేల్పూరుకి చెందిన అందే లోకేశ్వరరావు, అందే వెంకటలక్ష్మి (48) దంపతులు తాడేపల్లిగూడెం వైపు నుంచి తణుకు వైపు మోటార్ సైకిల్పై వస్తుండగా వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయాల పాలైన లోకేశ్వరరావును చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


