News July 5, 2024
ఉమామహేశ్వరంలో మంత్రులు, ఎమ్మెల్యేలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720161657299-normal-WIFI.webp)
అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామంలోని శ్రీ ఉమామహేశ్వర దేవాలయాన్ని రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజానర్సింహా, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, పలువురు దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలను ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు.
Similar News
News July 8, 2024
MBNR, NGKL జిల్లాల్లో నేడు భారీ వర్షాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720399545462-normal-WIFI.webp)
మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో నేడు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపటి నుంచి 3 రోజులు ఆయా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇప్పటికే గత రెండు రోజులుగా వర్షాలు పడడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.
News July 8, 2024
కృష్ణా జలాశయాలు లేక రైతులు ఆందోళన
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720404838240-normal-WIFI.webp)
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొల్లాపూర్, వనపర్తి, నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల పరిధిలో సుమారు ప్రస్తుతం మూడు లక్షలకు పైగా ఎకరాలకు కేఎల్ ద్వారా సాగు నీరందడంతో పాటు 300 గ్రామాలకు పైగా 500 చెరువులతో పాటు దుందుభీ నదిలో సైతం కృష్ణా జలాలతో కళకళలాడుతూ ఉండేది. ప్రస్తుతం నెలరోజులు పూర్తైనా ఇంకా కృష్ణా జలాశయాలు డెడ్జోరేజీలో ఉండటంతో పరివాహక ప్రాంత రైతులందరూ ఆందోళన చెందుతున్నారు.
News July 8, 2024
MBNR: జిల్లాకు అవసరమైన ఎరువుల రెడీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720404138820-normal-WIFI.webp)
వానాకాలం సీజన్లో రైతులకు కావలసిన యూరియా, డీఏపీ, కాంప్లెక్స్, ఎంవోపీ, ఎస్ఎస్పీ ఎరువులు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ చెబుతోంది. మహబూబ్ నగర్ జిల్లాకు అవసరమైన 54,104 మెట్రిక్ టన్నుల ఎరువులను ఇప్పటికే బఫర్ స్టాక్ గోదాంకు తరలించామని తెలిపింది. గతేడాది వరకు అమల్లో ఉన్న విధానంపై సమీక్ష చేసి ఒకవైపు డీలర్లకు, మరోవైపు మార్క్ ఫెడ్కు చెరిసగం ఎరువులు కేటాయించేలా శాఖ చర్యలు తీసుకుంది.