News November 18, 2025
ఉమ్మడిగా తనిఖీ చేసి ధర నిర్ణయించాలి: అల్లూరి కలెక్టర్

డీ.గొందూరు, కొంతలి, పాడేరు బైపాస్ జాతీయ రహదారికి కేటాయించిన భూములు అటవీ, ఉద్యానవనశాఖ, రెవెన్యూ శాఖ కలిసి క్షేత్రస్థాయిలో ఉమ్మడి తనిఖీ చేసి ధర నిర్ణయించాలని కలెక్టర్ దినేశ్ కుమార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో వీసీ నిర్వహించారు. జాతీయ రహదారి నిర్మాణంలో, జాతీయ పరిహారం చెల్లింపులలో లక్ష్యాలను నిర్దేశించుకుని, ఆ దిశగా భూములు కోల్పోయిన వారికి పరిహారం చెల్లింపులు చేయాలన్నారు.
Similar News
News November 18, 2025
ములుగు: డబ్బులు ఆడిగేందుకు వెళ్తే.. చంపారు!

యువతికి ఇచ్చిన డబ్బులు అడిగేందుకు వెళ్తే వ్యక్తిని <<18308316>>కొట్టి చంపిన ఘటన<<>> ములుగు జిల్లాలో కలకలం రేపింది. స్థానిక ఎస్సై తెలిపిన వివరాలు.. ఏటూరునాగారానికి చెందిన సమ్మయ్య లాలాయిగూడెంకు చెందిన యువతికి రూ.4 వేలు ఇచ్చాడు. డబ్బుల కోసం తరచూ వేధిస్తున్నాడని ఆదివారం రాత్రి యువతి ఇంటికి వచ్చిన సమ్మయ్యను.. యువతి తాత, నానమ్మ కలిసి రేకుల షెడ్డు కింద కట్టేసి కొట్టారు. దింతో సమ్మయ్య ప్రాణాలు కోల్పోయాడు.
News November 18, 2025
ములుగు: డబ్బులు ఆడిగేందుకు వెళ్తే.. చంపారు!

యువతికి ఇచ్చిన డబ్బులు అడిగేందుకు వెళ్తే వ్యక్తిని <<18308316>>కొట్టి చంపిన ఘటన<<>> ములుగు జిల్లాలో కలకలం రేపింది. స్థానిక ఎస్సై తెలిపిన వివరాలు.. ఏటూరునాగారానికి చెందిన సమ్మయ్య లాలాయిగూడెంకు చెందిన యువతికి రూ.4 వేలు ఇచ్చాడు. డబ్బుల కోసం తరచూ వేధిస్తున్నాడని ఆదివారం రాత్రి యువతి ఇంటికి వచ్చిన సమ్మయ్యను.. యువతి తాత, నానమ్మ కలిసి రేకుల షెడ్డు కింద కట్టేసి కొట్టారు. దింతో సమ్మయ్య ప్రాణాలు కోల్పోయాడు.
News November 18, 2025
HYDలో ఏకకాలంలో 15 చోట్ల ఐటీ రైడ్స్

హైదరాబాద్లో మరోసారి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రముఖ హోటళ్ల ఛైర్మన్లు, డైరెక్టర్ ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. HYD కేంద్రంగా నడుస్తున్న హోటల్స్లోనే రైడ్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా పిస్తా హౌస్, షాగౌజ్ లాంటి వ్యాపార వేత్తలపై సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. మొత్తం 15 చోట్ల ఏకకాలంలో ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


