News April 15, 2025

ఉమ్మడిజిల్లాలో నేటి టాప్ న్యూస్

image

నిర్మల్: జిల్లాలో 3 యాక్సిడెంట్లు.. ఇద్దరి మృతి, ముగ్గురు సీరియస్
మంచిర్యాల: ఉరేసుకొని యువకుడి సూసైడ్
మంచిర్యాలలో: బాలుడి కడుపు నుంచి బ్యాటరీ తీసిన వైద్యులు
సిర్పూర్(టి): ఐదేళ్ల బాలికపై కుక్కల దాడి
ADB: 500 దేశీదారు బాటిళ్లు సీజ్.. ఒకరి అరెస్ట్

పైన టూల్ బార్లో లొకేషన్ మీద, తర్వాత ‘వి’ సింబల్‌ని క్లిక్ చేసి మన గ్రామ/మండల/నియోజకవర్గ/జిల్లా ఎడిషన్ వార్తలను కేవలం 5 నిమిషాల్లోనే తెలుసుకోండి

Similar News

News April 16, 2025

నితీశ్ కుమార్ మళ్లీ సీఎం అవుతారు: నిషాంత్

image

బిహార్‌లో ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్ తిరిగి CM అవుతారని ఆయన కుమారుడు, JDU నేత నిషాంత్ ధీమా వ్యక్తం చేశారు. 2010 కంటే ఈసారి ఎక్కువ చోట్ల తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. అలాగే, బిహార్ Dy.CM సామ్రాట్ చౌదరి మాట్లాడుతూ.. INDI కూటమి ఎంత పోరాడినా ఫలితం ఉండదన్నారు. అటు నితీశ్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కాంగ్రెస్-RJD వ్యూహాలు రచిస్తోంది.

News April 16, 2025

2,019 మందికి రూ 20.19 కోట్లు జమ: పొంగులేటి

image

రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ.20.19 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. బేస్మెంట్ పూర్తి చేసుకున్న ఇళ్ల లబ్ధిదారులకు నగదు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. మొదటి విడతలో పైలెట్ ప్రాజెక్ట్ కింద మంజూరు చేసిన 70,122 ఇళ్లలో బేస్మెంట్ పూర్తి చేసుకున్న 2,019 మందికి రూ.లక్ష చొప్పున విడుదల చేసినట్లు ప్రకటించారు.

News April 16, 2025

నిర్మల్: ఈ వాహనమే ప్రాణం తీసింది

image

దిలావర్పూర్ మండల సిర్గాపూర్ సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. ఇందులో మహారాష్ట్రకు చెందిన రాజు (45)అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన కొడుకు కేదారనాథ్ అస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. మొదట్లో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టినట్లు కేసు నమోదుచేసిన పోలీసులు తర్వాత సీసీపుటేజీలను పరిశీలించి వాహనాన్ని గుర్తించారు.

error: Content is protected !!