News January 17, 2026

ఉమ్మడి ఓరుగల్లులో అతివలకు 149 డివిజన్లు!

image

ఉమ్మడి వరంగల్‌లోని 12 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 11 మున్సిపాలిటీలు, 1 గ్రేటర్ కార్పొరేషన్‌లోని వార్డులు, డివిజన్లకు రిజర్వేషన్లు ప్రభుత్వం ఖరారు చేసింది. మొత్తం 326 వార్డులకు 149 వార్డులను మహిళలకు రిజర్వ్ చేశారు. ST(మ) 15, SC(మ) 23, BC(మ) 39, జనరల్(మ) 72 వార్డులను రిజర్వ్ చేశారు. ఈరోజు సా.4 గం.కు కలెక్టర్లు ఏ డివిజన్ ఎవరికో ప్రకటించనుండటంతో ఆశావహులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Similar News

News February 9, 2026

టెన్త్ పరీక్షల ఫీజుకు 3 రోజులే గడువు: DEO

image

అల్లూరి, పోలవరం జిల్లా టెన్త్ విద్యార్థుల పరీక్షలు ఫీజు గడువు ఈ నెల 12తో ముగుస్తుందని DEO రామకృష్ణారావు సోమవారం తెలిపారు. తత్కాల్ ద్వారా రూ. 1000 అపరాధ రుసుంతో చెల్లించవచ్చన్నారు. ప్రైవేట్, రెగ్యులర్ విద్యార్థులకు ఈ గడువు వర్తిస్తుందన్నారు. WWW.bseap.org.website. ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చని సూచించారు. మార్చి 16 నుంచి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం అవుతాయన్నారు.

News February 9, 2026

ఉచిత అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలి: APC మమ్మీ

image

ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో 1వ తరగతిలో ఉచిత అడ్మిషన్లకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సమగ్ర శిక్ష APC మమ్మీ సోమవారం కోరారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు కేటాయించారని చెప్పారు. పేద, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు అవకాశం కల్పిస్తామన్నారు. నివాస ప్రాంతానికి సమీపంలోని పాఠశాలలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈనెల 20 నుంచి మార్చి10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు.

News February 9, 2026

నలుగురు లెక్చరర్లు.. రూ.4 లక్షల జీతం.. ఒక్కరే విద్యార్థి

image

AP: విద్యావ్యవస్థలో సరైన ప్రణాళిక, ముందుచూపు, కార్యాచరణ లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలిపే ఘటన ఇది. ఏలూరు(D) ముసునూరు ZP స్కూల్‌లో ఏర్పాటైన జూనియర్ కాలేజీలో ప్రస్తుతం ఒక్క విద్యార్థి ఉండగా, పాఠాలు చెప్పడానికి నలుగురు లెక్చరర్లు ఉన్నారు. వీరికి ప్రతినెలా ₹4L జీతం చెల్లిస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని, వెంటనే చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.