News September 16, 2024
ఉమ్మడి కరీంనగర్లో పట్టాలెక్కిన ‘వందేభారత్’
నాగపూర్- సికింద్రాబాద్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. ఎట్టకేలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వందేభారత్ ట్రైన్ పట్టాలెక్కింది. ఈ ట్రైన్ రామగుండం నుంచి సికింద్రాబాద్కు కేవలం 3 గంటల్లో చేరుకుంటుదని అధికారులు తెలిపారు. మంగళవారం మినహా మిగతా రోజుల్లో ఈ సర్వీస్ నడవనుంది. అయితే సికింద్రాబాద్ నుంచి రామగుండం వరకు ఏసీ చైర్కార్లో రూ.865 కాగా ఎగ్జిక్యూటివ్ చైర్కార్లో రూ.1,510గా ధర నిర్ణయించారు.
Similar News
News October 4, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొలువుదిరిన దుర్గ మాతలు @ కొండగట్టులో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. @ దసరా లోపు టీచర్ల నియామక ప్రక్రియ పూర్తి చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి. @ ఎల్లారెడ్డిపేటలో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య. @ కేశవపట్నం పోలీస్స్టేషన్ లో నాగుపాము హల్చల్.
News October 3, 2024
కరీంనగర్: పెరుగుతున్న గుండె వ్యాధిగ్రస్థులు!
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గుండె సంబంధిత వ్యాధిగ్రస్థుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. మానసిక ఒత్తిడే కారణమని వైద్యులు అంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ సంవత్సరంలో గుండె వ్యాధుల బాధితులు 30-50 ఏళ్లవారు 1760, 50 ఏళ్ల పైబడినవారు 2640 మంది ఉన్నట్లు వైద్య లెక్కలు చెబుతున్నాయి.
News October 3, 2024
KNR: మూడేళ్ల బాలికపై పిచ్చికుక్కలు దాడి
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని కోరపల్లిలో మూడేళ్ల బాలికపై గురువారం పిచ్చికుక్కలు దాడి చేశాయి. స్థానికుల ప్రకారం.. గ్రామానికి చెందిన బాలిక అక్షర.. ఆడుకునేందుకు ఇంటి ముందరికి వచ్చింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. బాలికను చికిత్స నిమిత్తం వరంగల్ MGMకు తరలించారు. గ్రామంలో కుక్కల బెడదను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.