News November 19, 2025
ఉమ్మడి కరీంనగర్లో BCలకు 268 GPలే..!

50% రిజర్వేషన్లు మించకూడదన్న నిబంధనతో బీసీలకు 22 శాతం రిజర్వేషన్ల క్యాప్తో ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కాగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1,216 గ్రామపంచాయతీల(GP)లో 22% రిజర్వేషన్లు కల్పిస్తే బీసీలకు మొత్తంగా 268 స్థానాలు మాత్రమే దక్కనున్నాయి. ఇక రిజర్వేషన్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సర్కార్ ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది.
Similar News
News March 6, 2026
అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మహిళా దినోత్సవ వేడుకలు: కలెక్టర్

జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి నియోజకవర్గానికి జిల్లా స్థాయి అధికారిని నోడల్ అధికారిగా నియమించామన్నారు. ఆ అధికారి స్థానిక ప్రజాప్రతినిథులు, అధికారులను సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేయాలన్నారు.
News March 6, 2026
అమెరికా చేతిలో గల్ఫ్ దేశాలు బలి!

మిడిల్ ఈస్ట్లోని చాలా దేశాల్లో అమెరికాకు మిలిటరీ స్థావరాలు ఉన్నాయి. ఆయా దేశాలతో కుదుర్చుకున్న రక్షణ ఒప్పందాలు, ఆటంకాలు లేని చమురు సరఫరా కోసం అమెరికా ఈ స్థావరాలను నిర్మించింది. అయితే అవే ఇప్పుడు గల్ఫ్ దేశాలకు ముప్పుగా మారాయి. వాటిని లక్ష్యంగా చేసుకొని ఇరాన్ దాడులకు తెగబడుతోంది. దీంతో అసలు యుద్ధంతో సంబంధం లేని సౌదీ, యూఏఈ, ఖతర్, బహ్రెయిన్, కువైట్లకు నష్టం వాటిల్లుతోంది.
News March 6, 2026
సివిల్స్ ఫలితాల్లో జనగామ యువకుడి సత్తా

సివిల్స్ ఫలితాల్లో జనగామ జిల్లాకు చెందిన భరత్ నాయక్ సత్తా చాటారు. 2023లో ఐఎఫ్ఎస్ కు సెలక్ట్ అయిన ఆయన తాజా ఫలితాల్లో 900వ ర్యాంక్ సాధించారు. ఐఐటి మద్రాసులో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఈ సందర్భంగా భరత్ నాయక్ తల్లిదండ్రులు బానోత్ దస్రు నాయక్, అనసూయ దంపతులను జిల్లా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.


