News August 27, 2025
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ

ఉమ్మడి KNR(D)లో రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలవారు, వాగులు, వంకల దగ్గర నివసించే వారు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రావద్దని తెలిపారు. వర్షంలో వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉన్నందున వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.
Similar News
News August 28, 2025
అమెరికాలో భారత వస్తువుల ధరలు పెంపు!

భారత్పై ట్రంప్ <<17529585>>టారిఫ్<<>> ఎఫెక్ట్ అమెరికాలో ధరలపై ప్రభావం చూపుతున్నాయి. టారిఫ్ పెంపుతో భారత వస్తువుల ధరలు 40-50శాతం పెంచుతున్నట్లుగా అమెరికాలోని గ్రాసరీ షాపుల ఎదుట పోస్టర్లు వెలిశాయి. దీంతో ఎన్ఆర్ఐలు, భారతీయ స్టూడెంట్లపై భారం పడే అవకాశముంది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలును వ్యతిరేకిస్తూ ట్రంప్ టారిఫ్ ఆంక్షలకు దిగారు. నిన్నటి నుంచి భారత్ ఎగుమతులపై 50శాతం టారిఫ్స్ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.
News August 28, 2025
HYDలో ఎక్కడి నీరు అక్కడే ఇంకేలా హైడ్రా చర్యలు

ఎంతటి వర్షం పడినా వరదలు సంభవించకుండా, ఎక్కడి నీరు అక్కడ భూమిలోకి ఇంకేలా హైడ్రా చర్యలు చేపట్టనుంది. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వర్షం కురిసినపుడు 100 లీటర్లు కురిస్తే అందులో 40 లీటర్లు భూమిలోకి ఇంకుతుంది. HYD నగరంలో ఇలాంటి పరిస్థితి లేదు. 98 లీటర్ల నీరు మురుగు కాలువల్లో కలుస్తోందని 2 లీటర్ల నీరు మాత్రమే భూమిలోకి ఇంకుతోందని హైడ్రా ఓ రిపోర్టులో పేర్కొంది.
News August 28, 2025
సెల్యూట్ సర్(PHOTO)

TG: కామారెడ్డిలో <<17537949>>వరదలు<<>> జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. పలు కాలనీలు నీట మునగగా అనేక మంది వరదలో చిక్కుకుపోయారు. ఈ క్రమంలో రంగంలో దిగిన పోలీసులు, రెస్క్యూ సిబ్బంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు శ్రమించారు. భయంతో బిక్కుబిక్కుమంటున్న చిన్నారిని ఓ పోలీసు భుజాలపై సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న ఫొటో వైరల్గా మారింది. విపత్తులో సామాన్యులను రక్షించిన పోలీసులకు నెటిజన్లు సలాం చేస్తున్నారు.