News March 31, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

@ మెట్ పల్లి మండలం పెద్దాపూర్ లో వైభవంగా మల్లన్న బోనాల జాతర. @ గంగాధర మండలంలో బిఆర్ఎస్ నాయకుల ధర్నా. @ చొప్పదండిలో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అరెస్ట్. @ సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలన్న రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్. @ ఓదెల మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ కరీంనగర్ లో కాలభైరవ స్వామిని దర్శించుకున్న ఎంపీ బండి సంజయ్. @ ఇబ్రహీంపట్నం మండలంలో పురుగు మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి.
Similar News
News January 27, 2026
KNR: కాకతీయ కెనాల్లో ఒకే రోజు రెండు మృతదేహాలు

కరీంనగర్ జిల్లా కాకతీయ కాలువలో ఒకేరోజు రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. చిగురుమామిడి మండలం నవాబుపేటకు చెందిన వివేక్ రెండు రోజుల క్రితం అదృశ్యం అవ్వగా.. నేడు సైదాపూర్ మండలం సోమారం శివారులోని కాకతీయ కాలువలో అతని మృతదేహం లభ్యమైంది. శంకరపట్నం మండలం కరింపేటకి చెందిన సాదుల అనిల్ మూడు రోజుల క్రితం కాకతీయ కాలువలో గల్లంతవ్వగా.. సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామ శివారులో అనిల్ మృతదేహం లభ్యమైంది.
News January 27, 2026
శంకరపట్నం: జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీ

శంకరపట్నం మండలం కేశవపట్నం జాతీయ రహదారిపై అర్ధరాత్రి 2 కార్లు ఢీకొన్నాయి. వేములవాడ దర్శనం చేసుకుని వరంగల్ వెళుతున్న ఎర్టిగా కార్ కేశవపట్నం పోలీస్ స్టేషన్ సమీపంలో ఎదురుగా వస్తున్న కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఎర్టిగా కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రెండు కార్ల ముందు భాగం పాక్షికంగా దెబ్బతింది. పోలీసులు వివరాలను నమోదు చేసుకున్నారు.
News January 26, 2026
KNR: TNGOs భవన్లో ఘనంగా గణతంత్ర వేడుకలు

కరీంనగర్ TNGOs భవన్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా TNGOs జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలను ప్రతి పౌరుడు గౌరవించాలని అన్నారు. దేశ అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని, సేవాభావంతో విధులు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో TNGOs నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.


