News March 20, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ ఇబ్రహీంపట్నం మండలం గండి హనుమాన్ చెక్ పోస్ట్ వద్ద 2,53,000 నగదు సీజ్. @ కరీంనగర్ రూరల్ స్టేషన్ ఏఎస్సై కిషన్ గుండెపోటుతో మృతి. @ ఓదెల మండలంలో విద్యుత్ షాక్ తో రైతు మృతి. @ పెద్దపల్లి మండలంలో విద్యుత్ షాక్ తో యువకుడి మృతి. @ కమలాపూర్ మండలంలో రైలు నుండి పడి యువకుడికి గాయాలు. @ మల్యాల మండలంలో ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య.
Similar News
News July 5, 2024
ఎల్లారెడ్డిపేట: ప్రవర్తన మార్చుకోని మహిళకు రూ.50 వేలు జరిమానా
ఎల్లారెడ్డిపేట మండలంలో ప్రవర్తన మార్చుకోకుండా బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన మహిళకు రూ.50 వేల జరిమానా విధించారు. నారాయణపూర్ గ్రామానికి చెందిన ఆనరాశి పోచవ్వ 2023 అక్టోబర్లో నాటుసారా తరలిస్తూ పట్టుబడింది. ఎల్లారెడ్డిపేట MRO ఆఫీస్ ఎదుట రూ.లక్ష పూచీకత్తుతో బైండోవర్ చేశారు. అయితే మరోసారి నాటుసారా తరలిస్తూ ఆమె పట్టుబడింది. దీంతో ఆమెకు జరిమానా విధించినట్లు ఎక్సైజ్ CI శ్రీనివాస్ తెలిపారు.
News July 5, 2024
KNR: నిరుపయోగంగా మారుతున్న రైతువేదికలు
రైతులకు ఆధునిక ,సాంకేతిక సమాచారాన్ని అందించేందుకు ఒక వేదికను నిర్మించాలని గత ప్రభుత్వం రైతు వేదికలకు శ్రీకారం చుట్టింది. ఆరేళ్ల క్రితం అట్టహాసంగా రైతువేదికల నిర్మాణం చేపట్టగా అసంపూర్తి పనులు చేపట్టి చేతులు దులుపుకున్నారు. కరీంనగర్ మండలంలో దుర్శేడు, బొమ్మకల్, నగునూర్, చామనపల్లిలో నిర్మించిన రైతువేదిక భవనాల్లో సౌకర్యాలు లేక, అసంపూర్తిగా నిర్మాణాలు చేయగా, ఇవి నిరుపయోగంగా మారుతున్నాయి.
News July 5, 2024
కరీంనగర్: జలపాతం వద్ద తేనెటీగల దాడి.. ఇద్దరికి గాయాలు
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్ జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లిన ఇద్దరు యువకులకు గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. కరీంనగర్కు చెందిన సంపత్, మన్నెంపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ గురువారం జలపాతాన్ని చూసేందుకు వెళ్లగా.. తేనెటీగలు దాడి చేశాయన్నారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు స్పృహ తప్పి పడిపోయారు. వారికి గాయాలు కావడంతో గ్రామస్థులు 108 ద్వారా హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.