News May 26, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ మెట్‌పల్లి మండలం జగ్గసాగర్‌లో వైభవంగా కొండ స్వామి రథోత్సవం. @ జగిత్యాల జిల్లాలో 25 మంది ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ ఓదెల మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్న సిరిసిల్ల ఎస్పి. @ మేడిపల్లి మండలంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.

Similar News

News November 1, 2025

KNR: తడిసిన ధాన్యాన్ని సేకరిస్తున్నాం: కలెక్టర్

image

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షానికి తడిసిన ధాన్యాన్ని సేకరిస్తున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 785 మెట్రిక్ టన్నుల తడిసిన ధాన్యాన్ని గుర్తించామని, IKP, PACs ద్వారా కొనుగోలు బాయిల్డ్ రైస్ మిల్స్కు తరలించినట్టు పేర్కొన్నారు. ఇప్పటివరకు కొంతమంది రైతులకు సుమారుగా రూ.57 లక్షలు జమ చేశామని తెలిపారు. మిగతా రైతులకు కూడా జమ అవుతాయన్నారు.

News November 1, 2025

కరీంనగర్: KGBVని పరిశీలించిన అడిషనల్ కలెక్టర్

image

కరీంనగర్ పట్టణంలోని సప్తగిరి కాలనీలోగల KGBVని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహిస్తున్న Physics Wallah Khan Academy క్లాసులను ఆమె పరిశీలించారు. తరువాత ఇంటర్‌మీడియెట్ మొదటి, రెండో సంవత్సరం BIPC, MPC తరగతులను తనిఖీ చేశారు. కాలేజీలో బోధనా ప్రమాణాలను తెలుసుకొని తగిన సూచనలు చేశారు. విద్యాప్రమాణాల మెరుగుదలపై పాఠశాల సిబ్బందితో అ.కలెక్టర్ చర్చించారు.

News November 1, 2025

కరీంనగర్ సీపీఓగా పూర్ణచంద్రారావు అదనపు బాధ్యతలు

image

కరీంనగర్ జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి (Chief Planning Officer – CPO)గా పనిచేసిన ఆర్. రాజారాం ఉద్యోగ విరమణ చేయడంతో, ఆ స్థానంలో మంచిర్యాల సీపీఓగా ఉన్న వి. పూర్ణచంద్రారావుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆర్థిక, గణాంకాల శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు వి. పూర్ణచంద్రారావు శుక్రవారం కరీంనగర్ సీపీఓగా బాధ్యతలు స్వీకరించారు.