News July 2, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ మెట్పల్లి, కోరుట్లలో పర్యటించిన జగిత్యాల కలెక్టర్. @ గోదావరిఖనిలో నలుగురు పేకాటరాయుళ్ల పట్టివేత. @ వెల్గటూర్ మండలంలో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య. @ పెద్దపల్లి మండలంలో ట్రాక్టర్, బైకు ఢీ మహిళ మృతి. @ తంగళ్ళపల్లి మండలంలో మద్యానికి బానిసై వ్యక్తి మృతి. @ సిరిసిల్ల, కరీంనగర్ లో పర్యటించిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు. @ కేసీఆర్ ను కలిసిన జగిత్యాల, సిరిసిల్ల జడ్పి ఛైర్పర్సన్లు.
Similar News
News July 5, 2024
కరీంనగర్: జలపాతం వద్ద తేనెటీగల దాడి.. ఇద్దరికి గాయాలు
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్ జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లిన ఇద్దరు యువకులకు గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. కరీంనగర్కు చెందిన సంపత్, మన్నెంపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ గురువారం జలపాతాన్ని చూసేందుకు వెళ్లగా.. తేనెటీగలు దాడి చేశాయన్నారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు స్పృహ తప్పి పడిపోయారు. వారికి గాయాలు కావడంతో గ్రామస్థులు 108 ద్వారా హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News July 5, 2024
జమ్మికుంట: భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య
జమ్మికుంట పట్టణంలోని మారుతి నగర్కు చెందిన జీడి కావ్య (28) ఆత్మహత్య చేసుకున్నట్లు CI రవి తెలిపారు. CI వివరాలు.. వీణవంక మండలం ఎల్బాక గ్రామానికి చెందిన జీడి రాజుతో 12 ఏళ్ల క్రితం కావ్య వివాహం జరిగింది. కొన్ని రోజులుగా భార్య కావ్యను అనుమానంతో భర్త రాజు వేధించాడు. దీంతో బుధవారం రాత్రి ఇంట్లో కావ్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కావ్య తల్లి ఫిర్యాదు మేరకు రాజుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
News July 5, 2024
KNR: బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన HYD శివారులో జరిగింది. నార్సింగి SI ప్రభాకర్ వివరాలు.. భీమదేవరపల్లి మండలం వంగరకు చెందిన మోహన్ గండిపేటలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో డ్రైవర్గా పనిచేస్తూ పీరంచెరువు భవాని కాలనీలో నివాసముంటున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు. చిన్న కొడుకు సందీప్ (21) ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. బుధవారం రాత్రి సందీప్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.