News December 28, 2025

ఉమ్మడి కరీంనగర్ జిల్లా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగారంలో అత్యల్పంగా 10.5℃ నమోదైంది. అటు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ములకాలపల్లిలో 10.7℃, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్లో 10.8℃, జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో 11℃ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News December 28, 2025

రాత్రి పడుకునే ముందు పాలు తాగితే..

image

రాత్రి సరిగా నిద్ర రావడం లేదని బాధపడేవారు పడుకునే ముందు గ్లాస్ గోరువెచ్చని పాలు తాగితే ప్రశాంతమైన నిద్ర వస్తుంది. పాలలో ఉన్న ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచి నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. అలాగే కాల్షియం, విటమిన్ D, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు ఒత్తిడిని తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పసుపు కలిపి తాగితే మరిన్ని ప్రయోజనాలుంటాయని నిపుణులు సూచిస్తున్నారు.

News December 28, 2025

రేపు కలెక్టరేట్‌లో రెవెన్యూ క్లీనిక్ ఏర్పాటు: కలెక్టర్

image

ప్రజాసమస్యల పరిష్కార వేదిక (PGRS)లో సోమవారం నుంచి రెవిన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఆదివారం తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ రెవెన్యూ సమస్యలకు పరిష్కారం అందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. జిల్లాలోని అన్ని మండలాల MROలు, గుంటూరు రెవిన్యూ డివిజనల్ అధికారి, తెనాలి సబ్ కలెక్టర్ గ్రామస్థాయి రికార్డులతో హాజరవుతారన్నారు. మండలాల వారీగా కౌంటర్లు ఉంటాయన్నారు.

News December 28, 2025

బంగ్లాదేశ్‌లో దాడులను అందరూ వ్యతిరేకించాలి: అమెరికా

image

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను అమెరికా ఖండించింది. ఒక వర్గానికి వ్యతిరేకంగా కామెంట్లు చేశారనే ఆరోపణలతో దీపూ చంద్రదాస్ అనే యువకుడిని ఓ ముఠా హత్య చేసిన ఘటనపై అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి దారుణమైన ఘటనలను అందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్‌లోని అన్ని వర్గాల భద్రత కోసం యూనస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్వాగతిస్తున్నానని చెప్పారు.