News March 22, 2025

ఉమ్మడి కరీంనగర్: వేర్వేరు ఘటనల్లో ఐదుగురి మృతి

image

ఉమ్మడి KNR జిల్లా వ్యాప్తంగా నిన్న ఐదుగురు మృతిచెందారు. KNR(D)శంకరపట్నంలో బైక్‌పై వెళ్తుండగా లారీ ఢీకొని తండ్రీ, కొడుకులు షేక్ అజీమ్, అబ్దుల్ రెహ్నాన్ చనిపోయారు. సైదాపూర్‌(M)బొత్తలపల్లిలో జరిగిన రోడ్డుప్రమాదంలో సదయ్య మృతిచెందాడు. ఎల్లారెడ్డిపేట(M)రాచర్లబొప్పాపూర్‌లో శ్రీనివాస్ పురుగుమందు తాగి ఆత్యహత్య చేసుకున్నాడు. HZB(M)తుమ్మనపల్లి ఎస్సారెస్పీ కెనాల్‌లో అరవింద్ అనే యువకుడి మృతదేహం లభ్యమైంది.

Similar News

News March 22, 2025

మంత్రి పొన్నంను కలిసిన కరీంనగర్ సీపీ

image

కరీంనగర్ సీపీగా ఇటీవల పదవి బాధ్యతలు స్వీకరించిన గౌస్ అలం రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం మంత్రిని సీపీ కలసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలు, ప్రజా భద్రతల రక్షణ దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలను గురించి వారు చర్చించారు.

News March 22, 2025

పెద్దపల్లి: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు యువకుడు బలి

image

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌‌లకు మరో యువకుడు బలయ్యాడు. పెద్దపల్లి(D) మంథని(M) విలోచవరానికు చెందిన కొరవేన సాయితేజ(26) పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుని KNRలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడని కుటుంబసభ్యులు తెలిపారు. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్‌లో దశలవారీగా రూ.10లక్షలు పోగొట్టుకున్నాడని, అప్పులు తీర్చే దారిలేక ఈ నెల 18న ఆత్మహత్యాయత్నం చేయగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడని పేర్కొన్నారు.

News March 22, 2025

కరీంనగర్: వరుసగా మృతదేహాలు లభ్యం

image

ఉమ్మడిKNR జిల్లావ్యాప్తంగా వరుసగా మృతదేహాలు లభ్యమవుతున్నాయి. గురువారం KNR జిల్లా చిగురుమామిడి(M) ఇందుర్తికి చెందిన అందే మల్లవ్వ అనే వృద్ధురాలి మృతదేహం తిమ్మాపూర్ ఎల్ఎండీ జలాశయం వద్ద లభ్యంకాగా, KNRలోని NTR విగ్రహం సమీపంలోని నాలాలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. వేములవాడ(M)అగ్రహారంలో గుర్తుతెలియని మగ మృతదేహం కనిపించింది. నిన్న HZB(M)తుమ్మనపల్లి SRSPకెనాల్‌లో అరవింద్ అనే యువకుడి మృతదేహం లభ్యమైంది.

error: Content is protected !!