News April 2, 2024

ఉమ్మడి కృష్ణా జిల్లాలో కాంగ్రెస్ MLA అభ్యర్థులు వీరే..

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో 11 మంది MLA అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది.
* తిరువూరు (SC) – లాం తాంతియా కుమారి
* నూజివీడు – కృష్ణా మరిడు
* గుడివాడ – వడ్డాడి గోవిందరావు
* కైకలూరు – బొడ్డు నోబుల్
* పెడన శొంఠి నాగరాజు
* మచిలీపట్నం – అబ్దుల్ మతీన్
* అవనిగడ్డ – అందే శ్రీరామ్మూర్తి
* పామర్రు (SC) – డీవై దాస్
* పెనమలూరు – ఎలిసల సుబ్రహ్మణ్యం
* మైలవరం – బొర్రా కిరణ్
* నందిగామ (SC) – మందా వజ్రయ్య

Similar News

News September 8, 2025

MTM: మీకోసం కార్యక్రమంలో 42 ఫిర్యాదులు

image

మచిలీపట్నంలో సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ ఆర్. గంగాధరరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 42 ఫిర్యాదులు అందగా, ప్రతి సమస్యపై చట్టపరమైన విచారణ జరిపి తక్షణ పరిష్కారం అందిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. సంబంధిత పోలీస్ అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు.

News September 8, 2025

యూరియా సరఫరాకు పటిష్ట చర్యలు: కలెక్టర్

image

యూరియా సరఫరాపై రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్ డీకే బాలాజీ సీఎం చంద్రబాబుకు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం CM చంద్రబాబు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి వీసీలో పాల్గొన్న కలెక్టర్ బాలాజీ యూరియా సరఫరాకు జిల్లాలో చేపట్టిన చర్యలను సీఎంకు వివరించారు.

News September 8, 2025

శ్రీరామపాద క్షేత్రంలో సుందర దృశ్యం

image

నాగాయలంకలోని శ్రీరామపాద క్షేత్రంలో ఉన్న శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం ఇటీవల కృష్ణానది వరదలకు శివలింగం, నంది వాహనం పూర్తిగా మునిగిపోయాయి. వరదలు తగ్గుముఖం పట్టడంతో ఆదివారం ఆలయాన్ని ప్రక్షాళన చేశారు. అనంతరం భక్తుల సందర్శన కోసం సిద్ధం చేయగా, సాయం సంధ్య వేళ రంగుల వర్ణాలతో ఆలయం ప్రత్యేకంగా కనిపించింది. ఈ సుందర దృశ్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.