News January 10, 2026
ఉమ్మడి ఖమ్మంలో గులాబీ జెండా ఎగరాలి: కేటీఆర్

రానున్న పురపాలక ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మంలోని అన్ని మున్సిపాలిటీల్లో BRS జెండా ఎగరాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం HYDలో నిర్వహించిన ఖమ్మం జిల్లా సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో పట్టణాలు అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచాయని ధ్వజమెత్తారు. జిల్లాకు ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నా, ప్రగతి మాత్రం శూన్యమని విమర్శించారు.
Similar News
News April 5, 2026
రంగారెడ్డి: మహిళలకు గుడ్ న్యూస్.. ఉచిత శిక్షణ!

రంగారెడ్డి జిల్లా గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించేందుకు SBI RSETI సువర్ణావకాశం కల్పిస్తోంది. టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో ఏప్రిల్ 13 నుంచి 30 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. 19 నుంచి 50 ఏళ్ల మధ్య గల మహిళలు దీనికి అర్హులు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతితో పాటు కోర్సు పూర్తయ్యాక ఉచితంగా టూల్కిట్ అందిస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు 7981951167, 9963562266 నంబర్లలో సంప్రదించాలన్నారు.
News April 5, 2026
చిట్వేలి వద్ద లారీ- కారు ఢీ.. తప్పిన ప్రాణనష్టం

చిట్వేలి మండల పరిధిలో ఆదివారం పెను ప్రమాదం తప్పింది. చిట్వేలి- రాపూరు ఘాట్ రోడ్డులో చిట్వేలి నుంచి నెల్లూరుకు వెళ్తున్న లారీ.. నెల్లూరు నుంచి చిట్వేలికి వస్తున్న కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్నవారు స్వల్ప గాయాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న చిట్వేలి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
News April 5, 2026
నంద్యాలలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

నంద్యాలలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. న్యాయశాఖ మంత్రి ఫరూక్, కలెక్టర్ రాజకుమారి, ఏఎస్పీ మందా జావళి తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని విక్టోరియా రీడింగ్ రూమ్ వద్ద ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 118వ జయంతి పురస్కరించుకుని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.


