News April 13, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓పలు శాఖలపై భద్రాద్రి, ఖమ్మం జిల్లా కలెక్టర్లు సమీక్షా సమావేశం
✓ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన
✓వేంసూర్ మండలంలో ఎంపీ నామా నాగేశ్వరరావు పర్యటన
✓ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
✓వైరా మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓అశ్వారావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన

Similar News

News April 21, 2025

ఖమ్మం: భానుడి ప్రతాపం.. ఆ మండలాల్లోనే టాప్.!

image

ఖమ్మం జిల్లాలో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఆదివారం చింతకాని, ముదిగొండ (పమ్మి), (బాణాపురం)లో అత్యధికంగా 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అటు కారేపల్లి, కామేపల్లి(లింగాల), వైరాలో 42.7, ఎర్రుపాలెం 42.6, కూసుమంచి 42.1, మధిర 42.0, పెనుబల్లి, నేలకొండపల్లి 41.7, రఘునాథపాలెం 41.6, ఖమ్మం (U) 41.4, ఖమ్మం (R) పల్లెగూడెం, తిరుమలాయపాలెం (బచ్చోడు) 41.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

News April 20, 2025

KMM: పేరెంట్స్ మందలించారని యువకుడి SUICIDE

image

తల్లిదండ్రులు మందలించారని కుమారుడు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం(D) నేలకొండపల్లి(M) శంకరగిరి తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన ధరావత్ రాజు(24) ఏ పని చేయకుండా కాళీగా ఉంటున్నాడని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని తెలిపారు. ఒక్కగానొక్క కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యాంతమయ్యారు. గ్రామంలో విషాదం నెలకొంది.

News April 20, 2025

నిప్పుల కొలిమిని తలపిస్తున్న ఖమ్మం

image

ఖమ్మం జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తుంది. ఉదయం 9 గంటల నుంచి భానుడు ఉగ్రరూపం దాల్చుతుండడంతో ప్రజలు సాయంత్రం వరకు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. అలాగే జిల్లాలోని పలుచోట్ల 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే వారం రోజులు సాధారణం కంటే రెండు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

error: Content is protected !!