News July 13, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు
> నేటి నుంచి సింగరేణి ప్యాసింజర్ రైలు పున: ప్రారంభం > ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం > ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు > చింతకాని మండలంతో సీపీఎం నేత రామ నరసయ్య సంస్కరణ సభ > ఖమ్మంలో ప్రజానాట్యమండలి శిక్షణా తరగతులు > గోదావరి వరదపై ఉన్నతాధికారులతో భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష > మణుగూరులో సింగరేణి పరిరక్షణకై కార్మికుల దీక్షలు
Similar News
News October 8, 2024
ఖమ్మం: అధికారుల తీరుపై కలెక్టర్ సీరియస్
ఖమ్మం జిల్లా అధికారులపై కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఫైర్ అయ్యారు. గ్రీవెన్స్ డేలో ఖమ్మం అర్బన్ మండలానికి చెందిన విజ్జుదేవి ఉద్యోగానికి కుల సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకుంది. సమయానికి తహశీల్దార్ స్వామి మంజూరు చేయకపోవడంతో ఆమె ఉద్యోగం కోల్పోయింది. ఈవిషయాన్ని ఆమె కలెక్టర్ దృష్టికి తేగా ప్రజాసమస్యలు పరిష్కారించడానికి ఉన్నారా.. సమస్యలు సృష్టించడానికి ఉన్నారా అంటూ తహశీల్దార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
News October 8, 2024
చెన్నారంలో శిశువు మృతదేహం కలకలం
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని చెన్నారం గ్రామంలో శిశువు మృతదేహం కలకలం రేపింది. గ్రామంలో ఓ వ్యక్తి ఇంటి ఎదుట మంగళవారం తెల్లవారుజామున శిశువు మృతదేహం పడేసి ఉంది. ఈ ఘటన గ్రామంలో చర్చనీయంగా మారింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతదేహన్ని ఎవరైనా తీసుకొచ్చి పడేశారా లేదా కుక్కలు లాక్కొచ్చాయా అనే కోణంలో విచారిస్తున్నారు.
News October 8, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు
∆} ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు
∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం& భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యాటన
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} కొత్తగూడెం పట్టణంలో విద్యుత్ సరఫరాల అంతరాయం