News August 25, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఓటర్ సర్వే
∆} ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
∆} అశ్వాపురంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} భద్రాచలంలో ఎమ్మెల్యే వెంకట్రావు పర్యటన
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
Similar News
News December 22, 2025
ఖమ్మం జిల్లాలో Dy.Cm పర్యటన షెడ్యూల్ ఇదే..!

ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంగళవారం పర్యటన షెడ్యూల్ వివరాలను అధికారులు విడుదల చేశారు. ఉదయం 11:35కు తల్లాడ (మం) పినపాకలో 33/11 KV విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు సత్తుపల్లిలో సింగరేణి జీఎం భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 2:30కు జీవీఆర్ ఓపెన్ కాస్ట్ మెయిన్-2ను తనిఖీ చేస్తారని పేర్కొన్నారు.
News December 22, 2025
సీఎస్ఎల్ ఆఫీసులో పొంగులేటి ఆకస్మిక తనిఖీ

భూపరిపాలన వ్యవస్థను మరింత పారదర్శకంగా అందించడానికి రెవెన్యూ స్టాంప్లు, రిజిస్ట్రేషన్ సర్వే విభాగాలు ఒకే ఫ్లాట్ ఫామ్ మీదకు తెచ్చి భూ భారతి పోర్టల్కు అనుసంధానం చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం నాంపల్లిలోని సీఎస్ఎల్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం వివిధ విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు.
News December 22, 2025
ఖమ్మంలో ఈనెల 24న జాబ్ మేళా

ఖమ్మం టీటీడీసీ భవనంలో ఈనెల 24న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత్ హ్యుందాయ్ కంపెనీలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఏదైనా డిగ్రీ అర్హత గల 24-35 వయస్సు గల యువతీ, యువకులు అర్హులని చెప్పారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగులు విద్యార్హత పత్రాలతో ఉదయం 10 గంటలకు జరిగే జాబ్ మేళాలో పాల్గొనాలని పేర్కొన్నారు.


